గన్నవరంలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం | ys jagan mohan reddy receives grand welcome at gannavaram airport | Sakshi
Sakshi News home page

గన్నవరంలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం

May 27 2016 9:15 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం పార్టీనేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో  పార్టీనేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఏటుకూరు బైపాస్ ప్రతిపాడు బయల్దేరారు. అక్కడ నుంచి పెదగొట్టిపాడు వెళతారు.

ఈ నెల 14న గుంటూరు లక్ష్మీపురంలో భవన నిర్మాణ పనుల్లో పునాది తీస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి పెదగొట్టిపాడుకు చెందిన ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement