'నాపట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారు'

'నాపట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారు' - Sakshi


విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ....ఓ మహిళను కించపరిచేలా ప్రయ్నతించటం దారుణమని ఎమ్మార్వో వనజాక్షి కన్నీటిపర్యంతమయ్యారు. ఇలా అయితే మహిళా ఉద్యోగులు ఎవ్వరూ బతకలేరని, ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని ఆమె అన్నారు. విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవిన్యూ ఉద్యోగులు గురువారం ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.



ఈ సందర్భంగా ఎమ్మార్వో వనజాక్షి మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతమనేని ప్రెస్మీట్ పెట్టి తన ఫ్యామీలి గురించి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎమ్మెల్యేకి తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.  నిజాయితీగా విధులు నిర్వహిస్తే.. ఎలాంటి రక్షణ కూడా ఉండదని, వ్యవస్థ ఇలా ఉంటే...మేం బతకలేమని, మహిళ ఉద్యోగులంతా ఆందోళనకు దిగుతామని ఆమె తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top