సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది.
సిరిసిల్లలో ఉద్రిక్తం
Aug 20 2016 11:13 AM | Updated on Nov 6 2018 4:04 PM
సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. సిరిసిల్ల పట్టణ బంద్ శనివారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆందోళన కారులు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలను దహనం చేశారు. దీంతో పలువురు ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పట్టణంలోని వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు మూతబడ్డాయి.
Advertisement


