ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ | Sakshi
Sakshi News home page

ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ

Published Fri, Jul 22 2016 5:52 PM

several ias officers transfers in andhra pradesh

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం కలెక్టర్గా ప్రవీణ్ కుమార్, నెల్లూరు కలెక్టర్గా ముత్యాలరాజు, విశాఖ మున్సిపల్ కమిషనర్గా హరినారాయణణ్, చిత్తూరు జాయింట్ కలెక్టర్గా గిరీశ్ షా, పాడేరు ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీడీగా శివశంకర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ప్రస్తుతం విశాఖ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న యువరాజు, అలాగే నెల్లూరు కలెక్టర్ జానకి సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement