సంక్రాంతి మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగ అని డీఆర్వో సి.మల్లీశ్వరిదేవి అన్నారు.
– డీఆర్వో సి.మల్లీశ్వరిదేవి
– కలెక్టరేట్లో ముగ్గుల పోటీ
అనంతపురం అర్బన్ : సంక్రాంతి మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగ అని డీఆర్వో సి.మల్లీశ్వరిదేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని ఉద్యోగినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. సాంకేతికంగా మనం ఎంత ముందుకు వెళ్లినా సంప్రదాయాలు మరువకూడదని చెప్పారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
విజేతలు వీరే : ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి కింద లహరిక, సుమతి, వరలక్ష్మి, రెండో బహుమతిని నిర్మలదేవి, పద్మావతి, తృతీయ బహుమతికి మాధవి, ప్రసన్న, మమత ఎంపికయ్యారు.