సబ్ జైలులో ఖైదీ ఆత్మహత్య | Remand prisioner dies after consuming acid | Sakshi
Sakshi News home page

సబ్ జైలులో ఖైదీ ఆత్మహత్య

Nov 8 2016 10:35 AM | Updated on Nov 6 2018 7:56 PM

మిర్యాలగూడ సబ్ జైలులో విచారణా ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

నల్గొండ: మిర్యాలగూడ సబ్ జైలులో విచారణా ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గూడూరు మండలం బండపెరికతండాకు చెందిన అజ్మీర వెంకటేశ్వర్లు(34) సబ్ జైలులో విచారణా ఖైదీగా ఉన్నాడు. సొంత అన్నను చంపిన కేసులో బెయిల్ వచ్చినా బయటకు వెళ్లకుండా జైలులోనే ఉంటున్నాడు.

గత కొద్ది రోజులుగా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న వెంకటేశ్వర్లు సోమవారం అర్ధరాత్రి సమయంలో బాత్రూంకు వెళ్లి యాసిడ్ తాగాడు. ఈ విషయాన్ని గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్ధితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement