సచివాలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు | Prohibitory orders in the vicinity of the Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు

Sep 17 2016 8:57 PM | Updated on Sep 4 2018 5:24 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఆందోళనలు, ర్యాలీలు చేపట్టరాదు. బహిరంగ సమావేశాలు నిర్వహించరాదు. ఐదుగురుకు మించి గుమికూడటం, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించడం, ఆయుధాలు వెంట పెట్టుకొని తిరగడం వంటివి చేయరాదు.  ఈ నెల 17 ఉదయం  6 గంటల నుంచి నవంబర్‌ 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉండే ఈ నిషేధాజ్ఞలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్ష 88 కింద కఠిన చర్యలు తీసుకుంటామని మహేందర్‌ రెడ్డి హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement