సాగర్‌ హైవేపై ప్రయివేట్‌ బస్సు బోల్తా | private bus roll over on the Sagar highway | Sakshi
Sakshi News home page

సాగర్‌ హైవేపై ప్రయివేట్‌ బస్సు బోల్తా

Feb 26 2017 11:28 PM | Updated on Aug 11 2018 8:12 PM

సాగర్‌ హైవేపై ప్రయివేట్‌ బస్సు బోల్తా - Sakshi

సాగర్‌ హైవేపై ప్రయివేట్‌ బస్సు బోల్తా

సాగర్‌ హైవేపై ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో పది మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి.

► పది మంది పాస్టర్లకు స్వల్ప గాయాలు
► నాగార్జునసాగర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం


యాచారం: సాగర్‌ హైవేపై ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో పది మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా యాచారం సీఐ మదన్ మోహన్ రెడ్డి తెలిపిన వివరాలు...నగరంలోని ఆంధ్ర క్రిష్టియన్ జికల్‌ కాలేజీకి చెందిన 26 మంది పాస్టర్లు శనివా రం ఉదయం గాంధీనగర్‌ నుంచి ఓ ఓ ప్రైవేటు బస్సులో నాగార్జునసాగర్‌ విహారయాత్రకు  వెళ్లారు.

నగరానికి తిరిగి వస్తుండగా రాత్రి 8–45 గంటల సమయంలో యాచారం– గునుగల్‌ గేట్ల మధ్యన క్రీడా క్షేత్రం సమీపంలో బస్సు బొల్తా పడింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది పాస్టర్లకు స్వల్పగాయాలయ్యాయి. వారిని వెంటనే నగరంలోని వివిధ ఆస్పత్రులకు పంపించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని,  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement