గొల్లప్రోలు మండలం వట్టెపూడి సెంటర్లో 16వ నెంబర్ జాతీయ రహదారిపై బైక్ను టాటా సుమో ఢీకొట్టి అదే వేగంతో పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.
గొల్లప్రోలు మండలం వట్టెపూడి సెంటర్లో 16వ నెంబర్ జాతీయ రహదారిపై బైక్ను టాటా సుమో ఢీకొట్టి అదే వేగంతో పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న స్థానిక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. సుమోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. వీరంతా సుమోలో రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.