గోడ కూలి ఒకరి మృతి | one died-in-wall-collapse | Sakshi
Sakshi News home page

గోడ కూలి ఒకరి మృతి

Jun 30 2016 11:43 AM | Updated on Sep 4 2017 3:49 AM

ఉపాధి కోసం వచ్చిన ఓ వ్యక్తి గోడ కూలిన ఘటనలో చనిపోయాడు.

కల్లూరు: ఉపాధి కోసం వచ్చిన ఓ వ్యక్తి గోడ కూలిన ఘటనలో చనిపోయాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలకేంద్రంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మహ్మదీయ మసీదు ఆవరణలోని షెడ్డులో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎ.సూరవరం గ్రామానికి చెందిన విశ్వనాథ ఈశ్వర్రావు అలియాస్ శివ(32) కొన్ని రోజులుగా ఉంటున్నాడు. గోనె సంచులు కుట్టేపని చేసుకుంటున్నాడు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి షెడ్డు గోడ బాగా నాని అర్థరాత్రి సమయంలో ఈశ్వర్రావుపై పడింది. దీంతీ శివ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement