పొలంలోనే ఆగిన రైతు గుండె | On the farm the farmer's death | Sakshi
Sakshi News home page

పొలంలోనే ఆగిన రైతు గుండె

Jul 24 2016 8:03 PM | Updated on Jun 4 2019 5:16 PM

పొలంలోనే ఆగిన రైతు గుండె - Sakshi

పొలంలోనే ఆగిన రైతు గుండె

గుండె పోటుతో ఓ రైతు మృతి చెందాడు.

మోత్కూరు : గుండె పోటుతో ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మోత్కూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మాపురం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మాపురం గ్రామానికి చెందిన రైతు నల్ల చంద్రయ్య (52).. అన్నెపు నరేందర్‌ వ్యవసాయ బావి వద్ద పొలం దున్నుతుండగా గుండెపోటుతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. చెంతనే ఉన్న రైతు నరేందర్‌ పొలం నుంచి చంద్రయ్యను బయటికి తీసుకువచ్చే లోపే మృతిచెందాడు. మృతుడికి భార్య మంగమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement