పోలీసుల మెడకు కృపామణి కేసు! | krupamani case quizzing | Sakshi
Sakshi News home page

పోలీసుల మెడకు కృపామణి కేసు!

Oct 28 2015 9:49 AM | Updated on Aug 21 2018 5:52 PM

పోలీసుల మెడకు కృపామణి కేసు! - Sakshi

పోలీసుల మెడకు కృపామణి కేసు!

కృపామణి ఆత్మహత్య కేసు పోలీసుల మెడకు చుట్టుకుంటోంది.

ఏలూరు: కృపామణి ఆత్మహత్య కేసు పోలీసుల మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయికి పోలీసులతో సన్నిహిత సంబంధాలున్నట్టు భావిస్తున్నారు. పోలీసుల సహకారంతో సాయి గతంలో పలువుర్ని భయపెట్టాడని, పోలీస్ స్టేషన్ అడ్డగా పలు సెటిల్మెంట్లు చేసినట్టు సమాచారం. గుడాల సాయి వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. అతని కాల్ డేటాను ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు.

ఈ కేసును పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భాస్కర భూషన్ పరిశీలిస్తున్నారు. కృపామణి భర్త పవన్ కుమార్ను పోలీసులు మరోసారి ప్రశ్నించారు. కృపామణి తల్లి లక్ష్మి, ప్రధాన నిందితుడు గుడాల సాయితో గల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సాయి నివాసంలో దొరికిన మెమొరీ కార్డును పోలీసులు విశ్లేషిస్తున్నారు. అతని బ్యాంక్ ఎకౌంట్లను సీజ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement