దేవరపల్లి : కృష్ణా పుష్కరాలు ప్రారంభం సందర్భంగా ఈ నెల 11 నుంచి కొవ్వూరు–గుండుగొలను రోడ్డులో భారీ వాహనాలు, లారీల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నట్టు కొవ్వూరు రూరల్ సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు.
11 నుంచి దేవరపల్లి వద్ద ట్రాఫిక్ మళ్లింపు
Aug 9 2016 11:25 PM | Updated on Oct 2 2018 4:09 PM
దేవరపల్లి : కృష్ణా పుష్కరాలు ప్రారంభం సందర్భంగా ఈ నెల 11 నుంచి కొవ్వూరు–గుండుగొలను రోడ్డులో భారీ వాహనాలు, లారీల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నట్టు కొవ్వూరు రూరల్ సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. పుష్కరాల సందర్భంగా దేవరపల్లి మూడు రోడ్లు జంక్షన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈనెల 11 నుంచి విశాఖపట్నం వైపు నుంచి చెన్నై, హైదరాబాద్ వెళ్లే వాహనాలను దేవరపల్లిలో గోపాలపురం, కొయ్యలగూడెం. జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట మీదుగా మళ్లిస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్లు, బస్సులు, మోటారు సైకిళ్లను మాత్రమే విజయవాడకు అనుమతించడం జరుగుతుంన్నారు. ఈనెల 25 వరకు ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుందని, కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ మల్లింపునకు సిబ్బందిని నియమించినట్టు ఆయన తెలిపారు. పుష్కరయాత్రికులకు అసౌకర్యం కలగకుండా వాహనదారులు
Advertisement
Advertisement