చిత్తూరు ట్రాఫిక్‌ డీఎస్పీపై రైతు ఫిర్యాదు | Farmer complaind on Chittoor traffic dsp | Sakshi
Sakshi News home page

చిత్తూరు ట్రాఫిక్‌ డీఎస్పీపై రైతు ఫిర్యాదు

Jan 31 2017 12:53 AM | Updated on Oct 1 2018 2:44 PM

అనంతపురం సెంట్రల్‌ : ఎలాగైనా తనం పొలం లాక్కోవాలని చిత్తూరు ట్రాఫిక్‌ డీఎస్పీ కొర్రపాటి కేశప్ప యత్నిస్తున్నాడని బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన రైతు రామలింగరెడ్డి సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో కలెక్టర్‌ శశిధర్‌కు, జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుకు ఫిర్యాదు చేశారు.

అనంతపురం సెంట్రల్‌ : ఎలాగైనా తనం పొలం లాక్కోవాలని చిత్తూరు ట్రాఫిక్‌ డీఎస్పీ కొర్రపాటి కేశప్ప యత్నిస్తున్నాడని బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన రైతు రామలింగరెడ్డి సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో కలెక్టర్‌ శశిధర్‌కు, జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, బాధిత రైతుతో కలిసి మాట్లాడారు. గ్రామ పరిధిలో సర్వేనంబర్‌ 15–1లో రామలింగారెడ్డికి 5.95 ఎకరాల పొలం ఉందన్నారు.

ఈ పొలం పక్కన చిత్తూరు ట్రాఫిక్‌ డీఎస్పీ కేశప్ప 25 ఎకరాల భూమి కొనుగోలు చేశాడన్నారు. పక్కనే ఉన్న 5.95 పొలాన్ని కూడా తనభూమిలోకి కలుపుకోవాలని ప్రయత్నించినప్పటికీ రామలింగారెడ్డి అమ్మడానికి ఒప్పుకోలేదన్నారు. దీంతో ఎలాగైనా ఆ పొలాన్ని లాక్కోవాలని డీఎస్పీ యత్నిస్తున్నాడని ఆరోపించారు.  అంతేకాక రైతును పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడన్నారు. గత నెల 29న 192 రామలింగారెడ్డి పొలంలోని చీనీ మొక్కలను కూడా ధ్వంసం చేయించారన్నారు. ఈ ఘటనపై బుక్కపట్నం పోలీస్‌స్టేష¯ŒSలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. డీఎస్పీపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement