రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు సతీమణి జె.పద్మావతి మంగళవారం సీనియర్ పోలీసు అధికారుల సతీమణులతో అతిథి గృహంలో సమావేశమయ్యారు.
ఐపీఎస్ల భార్యలతో డీజీపీ సతీమణి సమావేశం
Feb 24 2016 9:19 AM | Updated on Sep 3 2017 6:20 PM
విజయవాడ సిటీ: రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు సతీమణి జె.పద్మావతి మంగళవారం సీనియర్ పోలీసు అధికారుల సతీమణులతో అతిథి గృహంలో సమావేశమయ్యారు. జూన్ నాటికి విజయవాడ వచ్చేందుకు ఉన్న ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వచ్చే జూన్ నాటికి అధికార యంత్రాంగం విజయవాడకు తరలి రావాలంటూ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సీనియర్ పోలీసు అధికారుల భార్యలతో ఆమె సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడకు రావాల్సిన ఆవశ్యకత ఆమె వారికి వివరించినట్టు తెలిసింది. ఇదే సమయంలో వారితో కలసి ఉన్నతాధికారుల వసతి కోసం నిర్దేశించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని రెయిన్ ట్రీ పార్కు భవనాలను పరిశీలించారు.
Advertisement
Advertisement