హంద్రీనీవాకు 30 టీఎంసీలు కేటాయించాలి | allocate 30 TMC to Handriniva | Sakshi
Sakshi News home page

హంద్రీనీవాకు 30 టీఎంసీలు కేటాయించాలి

Aug 15 2016 12:30 AM | Updated on Sep 26 2018 6:21 PM

కరువు జిల్లా ‘అనంత’ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం నుంచి హంద్రీనీవా సుజలస్రవంతి పథకం ద్వారా 30 టీఎంసీలు కేటాయించాలని జలసాధన సమితి జిల్లా అధ్యక్షులు రామ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

అనంతపురం సెంట్రల్‌ :  కరువు జిల్లా ‘అనంత’ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం నుంచి హంద్రీనీవా సుజలస్రవంతి పథకం ద్వారా 30 టీఎంసీలు కేటాయించాలని జలసాధన సమితి జిల్లా అధ్యక్షులు రామ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జిల్లాలో తాగునీటికే 10 టీఎంసీలు అవసరమవుతాయన్నారు. యుద్ధప్రాతిపదికన హంద్రీనీవా పనులు పూర్తి చేయాలని, 30 టీఎంసీలు తీసుకొచ్చి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement