చంద్రబాబు సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు | again muddaraboina venkateswara rao vs maganti babu | Sakshi
Sakshi News home page

మాగంటి బాబు వర్గంపై చంద్రబాబు ఆగ్రహం

Jul 29 2016 2:00 PM | Updated on Sep 4 2017 6:57 AM

చంద్రబాబు సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు

చంద్రబాబు సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు

కృష్ణాజిల్లా నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీ, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు, లోక్ సభ సభ్యుడు మాగంటి బాబు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.

నూజివీడు :  కృష్ణాజిల్లా నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీ, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు, లోక్ సభ సభ్యుడు మాగంటి బాబు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే  వారిమధ్య విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. నూజివీడులో జరిగిన వనం-మనం కార్యక్రమం  సందర్భంగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు, మాగంటి బాబు వర్గాల మధ్య శుక్రవారం ఘర్షణ జరిగింది. 

ముద్రబోయిన వర్గాన్ని స్టేజ్ మీదకు పిలవడంపై మాగంటి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మాగంటి బాబు అనుచరులు స్టేజ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ...మాగంటి బాబు వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ముద్రబోయిన, మాగంటిల మధ్య వైరం ఉంది. పలు సందర్భాల్లో వీరిద్దరూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement