ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి | van falls off bridge in Maharashtra, Seven Killed | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి

Nov 30 2019 10:33 AM | Updated on Nov 30 2019 10:47 AM

van falls off bridge in Maharashtra, Seven Killed - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ధులే జిల్లా వించూర్‌ సమీపంలో అర్థరాత్రి సమయంలో ఓ వ్యాన్‌ అదుపు తప్పి వంతెన పైనుంచి లోయలో పడింది. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు సంఘటనా స్థలంలో ప్రాణాలు విడిచారు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement