గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి

Two Men killed Due To Wall Collapse In West Godavari - Sakshi

సాక్షి, ఉంగుటూరు : గోడ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణ పురంలో చోటు చేసుకుంది. రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజే కొద్దిగా వర్షం తెరిపి ఇవ్వడంతో పెద్దిరెడ్డి రాఘవమ్మ(60) అనే వృద్ధురాలు అటుగా వెలుతున్న సిరిపురపు శ్రీను(40) ఇంటిపై కవర్‌ కప్పాల్సిందిగా కోరింది. దీంతో శ్రీను ఇంటిపైకి బరకం వేస్తుండగా గోడ కూలింది. ఈ ప్రమాదంలో శ్రీను, రాఘవమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top