నిజామాబాద్‌లో మరో ఆటో ప్రమాదం | Tragic Auto Accident In Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో మరో ఆటో ప్రమాదం

Mar 26 2018 3:35 PM | Updated on Apr 3 2019 8:03 PM

Tragic Auto Accident In Nizamabad - Sakshi

సాక్షి, నిజమాబాద్‌: ఆటో బావిలో పడి 11 మంది దుర్మరణం చెందిన ఘటనను మరువకముందే నిజామాబాద్‌లో మరో ఆటో ప్రమాదం జరిగింది. ఆర్మూర్‌లోని సిద్దుల గుట్ట ఘాట్‌ రోడ్డుపై సోమవారం ఉదయం ఓ ఆటో అదుపు తప్పి పడిపోవడంతో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆర్మూర్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా అతి వేగమే ఆటో బోల్తాకు కారణమని స్థానికులు అంటున్నారు. గాయపడినవారిలో నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌కు చెందిన సువర్ణ, మామిడిపల్లికి చెందిన వెంకట్‌ స్వామి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement