భయంతో మేడపై నుండి దూకిన యువతి

Police Ride on Pub Young Women Jump From Building - Sakshi

భయంతో మేడపై నుండి దూకిన యువతి

కర్ణాటక,యశవంతపుర : సీసీబీ పోలీసులు పబ్‌పై దాడి చేసిన సమయంలో బిల్డింగ్‌పై నుండి పారిపోయే క్రమంలో ఓ యువతి తీవ్రంగా గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25న అశోక్‌నగర పోలీసుస్టేషన్‌ పరిధిలో బ్రిగేడ్‌ పబ్‌పై సీసీబీ పోలీసులు దాడి చేశారు. ఈ సమయంలో ఓ యువతి పారిపోయే క్రమంలో బిల్డింగ్‌పై నుంచి జారి పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో కోమాలోకి వెళ్లింది. యువతి గాయపడిన కేసును పోలీసులు తారుమారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top