దంపతుల హత్య: కన్న కొడుకే చంపాడు | Police Held Two Mans In Couple Murder Case In Anantapur | Sakshi
Sakshi News home page

హత్య కేసును ఛేదించిన పోలీసులు

Feb 17 2020 7:15 PM | Updated on Feb 17 2020 7:56 PM

Police Held Two Mans In Couple Murder Case In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని డి. హీరేహాళ్‌లో జరిగిన జంట హత్యల కేసును పోలీసులు సోమవారం ఛేదించారు. వృద్ధ దంపతులను కన్న కొడుకే హత్య చేసినట్లు విచారణలో తేలడంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది నవంబర్‌లో బసవరాజు, లక్షిదేవి అనే వృద్ధ దంపతులు హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో వారి హత్యపై అనుమానాలు ఉన్నాయంటూ కొడుకు అశోక్‌ బంధువులపై ఫిర్యాదు చేశారు. అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రేమ వివాహానికి నిరాకరించారనే అక్కసుతో తల్లిదండ్రులను చంపినట్లు అశోక్‌ పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు.  ఇక ఈ కేసులో అశోక్‌తో పాటు అతడి స్నేహితుడు జమ్మన్నలను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement