అగర్వాల్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు | Police Chased Agarwal Murder Case In Hyderabad | Sakshi
Sakshi News home page

Aug 25 2018 11:24 AM | Updated on Sep 4 2018 5:44 PM

Police Chased Agarwal Murder Case In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ క్రైమ్‌ : రాజేంద్రనగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్‌ అగర్వాల్‌ ఇంట్లో చోరి చేసి, అతన్ని హత్య చేసిన ఘటనలో నిందితులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర పనిచేసే పట్నాకు చెందిన డ్రైవర్‌.. ఈ దోపిడీకి ప్లాన్‌ చేసి తన గ్యాంగ్‌తో ఇక్కడికి వచ్చాడని పోలీసులు తెలిపారు. దోపిడీ చేసే క్రమంలో అగర్వాల్‌ నోటికి ప్లాస్టర్‌ వేయడంతో ఊపిరాడక మరణించినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement