చాక్లెట్ కవర్లుగా బంగారం!
హైదరాబాద్: చాక్లెట్లు, మిఠాయిలపై ఉండే కవర్లలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి చాక్లెట్లు, మిఠాయిల కవర్లపై బంగారంతో చేసిన కవర్లతో పాటు ఓ ఫొటోఫ్రేమ్కు ఉన్న రేకును బాక్స్లో పెట్టి తీసుకొచ్చాడు.
శనివారం ఉదయం కస్టమ్స్ అధికారుల తనిఖీలను గమనించిన అతడు..బాక్స్ని విమానాశ్రయంలోనే వదిలి పరారయ్యాడు. తనిఖీల్లో దాదాపు రూ. 19 లక్షలు విలువైన 585.64 గ్రాముల బంగారాన్ని స్వా«ధీనం చేసుకున్నారు.