మొబైల్‌ రీచార్జ్‌ చేయించలేదని.. | Married Woman Commits Suicide Attempt in Anantapur | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Dec 26 2018 12:32 PM | Updated on Dec 26 2018 12:32 PM

Married Woman Commits Suicide Attempt in Anantapur - Sakshi

చికిత్స పొందుతున్న జ్యోతి

మొబైల్‌కు రీచార్జ్‌ చేయించలేదని మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. కర్ణాటక రాష్ట్రం టుంకూరు జిల్లాకు చెందిన రాజశేఖర్, జ్యోతి దంపతులు ఏడాది కిందట ధర్మవరం పట్టణానికి వలస వచ్చారు.

అనంతపురం, ధర్మవరం అర్బన్‌: మొబైల్‌కు రీచార్జ్‌ చేయించలేదని మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. కర్ణాటక రాష్ట్రం టుంకూరు జిల్లాకు చెందిన రాజశేఖర్, జ్యోతి దంపతులు ఏడాది కిందట ధర్మవరం పట్టణానికి వలస వచ్చారు.

దుర్గానగర్‌లో నివాసముంటూ కూలి మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నారు. జ్యోతి మంగళవారం తన తల్లికి ఫోన్‌చేసి రీచార్జ్‌ చేయించాలని కోరింది. అయితే ఆమె రీచార్జ్‌ చేయించకపోగా మందలించడంతో జ్యోతి మనస్తాపం చెంది విషపుద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే భర్త ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పట్టణ సిఐ అస్రార్‌బాషా, హెడ్‌కానిస్టేబుల్‌ వీవీ నాయక్‌లు బాధితురాలు ద్వారా ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement