ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో..

Man Fraud With Women In Kurnool District - Sakshi

నమ్మించి బాలికను  మోసగించిన ఘనుడు 

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

జూపాడుబంగ్లా: చదువుకుంటున్న   బాలికను  ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ ఘనుడు. మంగళవారం బాధితురాలు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది.  ఎస్‌ఐ తిరుపాలు తెలిపిన వివరాల మేరకు...జూపాడుబంగ్లా గ్రామం నీలిపల్లెపేట కాలనీకి చెందిన బాలికను అదే కాలనీకి చెందిన క్రిష్ణయ్య అలియాస్‌ సౌందర్‌రాజు (22 ఏళ్లు) అనే యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అంగీకరించకపోవడంతో పెళ్లి చేసుకుంటానని  మాయమాటలు చెప్పాడు.  శారీకంగా లోబర్చుకున్నాడు. తర్వాత ఆ  బాలిక పెళ్లి చేసుకోవాలని  అడిగితే దాటవేస్తూ  వచ్చాడు.

మంగళవారం కర్ణాటక రాష్ట్రం గంగావతి మండలం, చౌట్కూ రు గ్రామానికి చెందిన  యువతిని పెళ్లిచేసుకునేందుకు  సిద్ధమయ్యాడు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి అక్కడికి వెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితురాలు జూపాడుబంగ్లా పోలీసు స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు హుటాహుటినా కర్ణాటకకు వెళ్లి వివాహానికి రెడీ అవుతున్న  సౌందర్‌రాజును  అదుపులోకి తీసుకున్నారు. పెళ్లిని ఆపి నిందితుడిని జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top