రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం 

Man Died In Road Accident - Sakshi

ఇద్దరికి గాయాలు...

ఆత్మకూరు(ఎం) (ఆలేరు) :  డీసీఎం బోల్తాపడిన ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన  మండల కేంద్రంకు సమీపంలో జేఏసీ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....

బొమ్మలరామారం మండలం లక్ష్మీతండాకు చెందిన ఇంద్రావత్‌ పాండు(36) మోత్కూరు నుంచి తన సొంత డీసీఎం ద్వార  బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి ఇసుకను తరలిస్తున్నారు.

డ్రైవర్, యజమాని అయిన పాండుతో పాటు కూలీలు  స్వామి,  లక్ష్మణ్, దారవత్‌ భిక్షం ప్రయాణిస్తున్నారు. ఆత్మకూరు(ఎం) మండలం జేఏసీ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో మెయిన్‌ రోడ్డు పక్క చెట్టును ఢీకొట్టడంతో అదుపు తప్పి పడి పోయింది.

ఈ సంఘటనలో పాండు అక్కడికక్కడే మృతిచెందారు. డీసీఎంలో ప్రయాణిస్తున్న స్వామి, లక్ష్మణ్, భిక్షలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతుడి భార్య ఇంద్రావత్‌ శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కనకటి యాదగిరి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top