భారీ అగ్ని ప్రమాదం..రూ.100 కోట్ల నష్టం | Fire Accident In LS Auto Mobiles At Tiruvallur | Sakshi
Sakshi News home page

తిరువళ్లూరులో భారీ అగ్ని ప్రమాదం

Nov 9 2018 8:29 AM | Updated on Nov 9 2018 10:00 AM

Fire Accident In LS Auto Mobiles At Tiruvallur - Sakshi

మంటలకు పూర్తిగా కాలిపోతున్న ఎల్‌ఎస్‌ ఆటోమొబైల్‌ గోడౌన్‌

ఈ ఘటనలో సుమారు రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్లు ..

చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని ఎల్‌ఎస్‌ ఆటో మొబైల్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం ప్రాధమికంగా అంచనా వేసింది. ఈ ఆటో మొబైల్‌ కంపెనీలో కారు స్పేర్ పార్ట్స్ తయారీ చేస్తారు. సుమారు 1500  కార్మికులు పని చేస్తున్నారు. శుక్రవారం వేకువజామున 1.30 సమయంలో ప్రమాదం జరిగింది. అప్పుడు 50 మంది కార్మికులు  మాత్రమే పనిలో ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రమాదం జరగలేదు. కంపెనీ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణమా అని కంపెనీ యాజమాన్యం వెల్లడించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement