నవవధువు ఆత్మహత్యాయత్నం | Bride Commits Suicide in Palamaner Chittoor | Sakshi
Sakshi News home page

నవవధువు ఆత్మహత్యాయత్నం

Mar 30 2019 1:05 PM | Updated on Mar 30 2019 1:05 PM

Bride Commits Suicide in Palamaner Chittoor - Sakshi

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లావణ్య

భర్త దుర్మరణాన్ని తట్టుకోలేక జీవితంపై విరక్తి పరిస్థితి విషమం

మదనపల్లె సిటీ: పెళ్లైన రెండు నెలలకే భర్త రైలు ప్రమాదంలో మృతి చెందడంతో తట్టుకోలేక ఓ నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం బి.కొత్తకోటలో చోటుచేసుకుంది. బాధితుల కథనం..బి.కొత్తకోటకు చెందిన భరత్, శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన లావణ్య(25) గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. బీఎస్సీ నర్సింగ్‌ చేస్తున్న ఇద్దరూ మూడు రోజుల క్రితం టెక్కలి నుంచి బి.కొత్తకోటకు వచ్చేందుకు నౌపడ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కుతూ ప్రమాదశాత్తు జారి పడి భరత్‌ మృతి చెందాడు.  భర్త కర్మకాండలకు బి.కొత్తకోటలో ఉన్న లావణ్య  ఇంట్లో ఎవరూ లేని సమయంలో టాయిలెట్‌ క్లీనర్‌ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement