ముంబైలో రసాయన కర్మాగారంలో పేలుడు

Blast At Chemical Factory In Palghar Near Mumbai - Sakshi

ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబై లోని ఓ రసాయన కర్మాగారంలో శనివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా, చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ముంబై సమీపంలోని తారాపూర్ కెమికల్ జోన్‌లో ఈ పేలుడు సంభవించిది. సమాచారం తెలుసుకున్న ముంబై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top