
సాక్షి,ముంబై: పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు ( 25) పెట్రోలు పై 16 పైసలు, డీజిల్పై 17 పైసలు చొప్పున ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదే బాటలో పయనిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు వారం రోజుల్లో 5 శాతం పెరుగుదలనునమోదు చేయగా, గత శుక్రవారం చమురు ధరలు మూడు నెలల గరిష్ట స్థాయికి చేరాయి.
మరోవైపు యూఎస్-చైనా ట్రేడ్ డీల్తో పాటు డాలర్తో రూపాయి మారకం విలువ స్వల్పంగా పుంజుకోవడం లాంటివి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణాలుగా ఎనలిస్టులు చెబుతున్నారు.
హైదరాబాద్ : లీటర్ పెట్రోల్ ధర రూ.75.95 డీజిల్ ధర రూ.72.63
అమరావతి : లీటర్ పెట్రోల్ ధర రూ.75. 71,డీజిల్ ధర రూ. 71.99
ఢిల్లీ : లీటర్ పెట్రోల్ ధర రూ.71.57,డీజిల్ ధర రూ.66.80
ముంబై : లీటర్ పెట్రోల్ ధర 77.20m డీజిల్ ధర69.80.
చెన్నై: లీటర్ పెట్రోల్ ధర రూ.74.32 డీజిల్ ధరరూ.70.59.
కోల్కతా : లీటర్ పెట్రోల్ ధర రూ.73.67, డీజిల్ ధరరూ.68.59.