పెరుగుతున్న పెట్రోలు ధరలు | Petrol Diesel Prices go Up Again    | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న పెట్రోలు ధరలు

Feb 25 2019 3:05 PM | Updated on Feb 25 2019 3:05 PM

Petrol Diesel Prices go Up Again    - Sakshi

సాక్షి,ముంబై:  పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు ( 25) పెట్రోలు పై 16 పైసలు, డీజిల్‌పై 17 పైసలు చొప్పున ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదే బాటలో పయనిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు వారం రోజుల్లో 5 శాతం పెరుగుదలనునమోదు చేయగా, గత శుక్రవారం చమురు ధరలు మూడు నెలల గరిష్ట స్థాయికి చేరాయి.

మరోవైపు యూఎస్-చైనా ట్రేడ్ డీల్‌తో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా  పుంజుకోవడం లాంటివి  పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణాలుగా ఎనలిస్టులు చెబుతున్నారు. 

హైదరాబాద్‌ : లీటర్ పెట్రోల్ ధర రూ.75.95  డీజిల్ ధర రూ.72.63
అమరావతి : లీటర్ పెట్రోల్ ధర రూ.75. 71,డీజిల్ ధర రూ. 71.99
 
ఢిల్లీ :  లీటర్ పెట్రోల్ ధర రూ.71.57,డీజిల్ ధర రూ.66.80
ముంబై :  లీటర్ పెట్రోల్ ధర 77.20m డీజిల్ ధర69.80.
చెన్నై:  లీటర్ పెట్రోల్ ధర  రూ.74.32 డీజిల్ ధరరూ.70.59. 
కోల్‌కతా : లీటర్ పెట్రోల్ ధర  రూ.73.67,  డీజిల్ ధరరూ.68.59. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement