♦ రిజర్వు ధర రూ.366 కోట్లు
♦ అయినా ముందుకు రాని బిడ్డర్లు
ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్... బ్రాండు, ట్రేడ్మార్క్ల వేలం మరోసారి ఫ్లాపయ్యింది. దాదాపు రూ.9,000 కోట్ల రుణ బకాయిలను రాబట్టుకోవడానికి బ్యాంకులు శనివారం నిర్వహించిన వేలానికి స్పందన కరువైంది. 2010లో బ్రాండ్ విలువను దాదాపు రూ.4,000 కోట్ల మేర లె క్కించి రుణాలిచ్చిన బ్యాంకులు.. ప్రస్తుతం రిజర్వ్ ధరను అందులో పదో వంతు కన్నా తక్కువగా రూ.366.70 కోట్లుగా నిర్ణయించి వేలానికి పెట్టాయి. అయినా కూడా ఒక్క బిడ్ సైతం రాలేదు. ఈ రేటు ఎక్కువ కావటంతో బిడ్డర్లు రాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
నెలన్నర కిందట 17 బ్యాంకుల కన్సార్షియం కింగ్ ఫిషర్ హౌస్ను రూ.150 కోట్లకు వేలానికి పెట్టినప్పుడూ ఇదే పరిస్థితి. ఒక్క బిడ్ కూడా రాలేదు. తాజా పరిణామంతో బ్యాంకులు.. కింగ్ఫిషర్ హౌస్, కింగ్ఫిషర్ బ్రాండ్ రిజర్వ్ ధరను పునఃసమీక్షించి, తగ్గించే అవకాశం ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. శనివారం కింగ్ఫిషర్ లోగోతో పాటు ‘ఫ్లై ది గుడ్టైమ్స్’ ట్యాగ్లైను, ఫ్లయింగ్ మోడల్స్, ఫన్లైనర్, ఫ్లై కింగ్ఫిషర్, ఫ్లయింగ్ బర్డ్ డివైజ్ తదితర ట్రేడ్మార్క్లను వేలానికి ఉంచారు. ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ ఆధ్వర్యంలో ఉదయం 11.30 గం.కు ప్రారంభమైన ఈ-ఆక్షన్ .. దాదాపు గంటసేపు సాగింది.
కింగ్ఫిషర్ లోగోను ఏవియేషన్ అవసరాలకు మాత్రమే తప్ప ఇతరత్రా వ్యాపారాలకు వినియోగించుకోవడానికి వీల్లేదంటూ యునెటైడ్ బ్రూవరీస్ (కింగ్ఫిషర్ ప్రమోటరు విజయ్ మాల్యా కంపెనీ) హెచ్చరించడం కూడా వేలంపై ప్రభావం చూపి ఉండొచ్చని మరో బ్యాంకరు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రాండును కొనుక్కుని, పునరుద్ధరించడం కన్నా కొత్తగా ఎయిర్లైన్ కంపెనీ పెట్టడమే చవకైన వ్యవహారమని బ్రాండింగ్ నిపుణులు చెప్పారు. 2010లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పరిస్థితి బాగున్నప్పుడు కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్.. కంపెనీ బ్రాండ్ విలువను రూ. 4,000 కోట్లుగా లె క్కించింది.
‘కింగ్ఫిషర్’ బ్రాండ్ల వేలం మళ్లీ ఫ్లాప్
Published Sun, May 1 2016 1:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement