కావలి ఎమ్మెల్యే దీక్ష భగ్నం | ysrcp mla pratap kumar reddy hunger strike | Sakshi
Sakshi News home page

కావలి ఎమ్మెల్యే దీక్ష భగ్నం

Feb 20 2015 8:29 PM | Updated on May 29 2018 4:18 PM

కావలి ఆయకట్టు భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి చేస్తున్న దీక్షకు శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు.

నెల్లూరు: కావలి ఆయకట్టు భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి చేస్తున్న దీక్షకు శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష భగ్నంతో  వైఎస్ఆర్ సీపీ నేతలు రాస్తారోకో చేపట్టారు.

జిల్లాలోని సంగెం బ్యారేజ్ ను త్వరగా నిర్మించాలని ,కావలి కాల్వకు పూర్తిస్థాయి సాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement