గోడకూలి చిన్నారి సహా ఇద్దరు మృతి | Two people, including a child killed in wall collapse | Sakshi
Sakshi News home page

గోడకూలి చిన్నారి సహా ఇద్దరు మృతి

Apr 23 2015 11:59 AM | Updated on Aug 25 2018 5:33 PM

అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎర్రమల్లెపల్లెలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరు గాయాలపాలయ్యారు.

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎర్రమల్లెపల్లెలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరు గాయాలపాలయ్యారు. గ్రామానికి చెందిన ఎర్రస్వామి(25), రామాంజినమ్మ(20) దంపతులు తమ కుమార్తె శ్వేత(5)తో కలసి బుధవారం రాత్రి ఇంటి బయట నిద్రించారు. అర్థరాత్రి సమయంలో వారు నిద్రిస్తున్న చోట ఉన్న పాత గోడ కూలి వారిపై పడింది.

ఈ ఘటనలో రామాంజినమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శ్వేత అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయింది. కాగా, స్వల్పంగా గాయపడిన ఎర్రస్వామి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement