శ్రీకాకుళంలో తుపాను బాధితుల ధర్నా | Titli Cyclone Victims Protesting At MRO Offices In Srikakulam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళంలో తుపాను బాధితుల ధర్నా

Oct 18 2018 11:22 AM | Updated on Oct 18 2018 12:06 PM

Titli Cyclone Victims Protesting At MRO Offices In Srikakulam  - Sakshi

శ్రీకాకుళం: నరసన్నపేట, పాతపట్నం ఎమ్మార్వో ఆఫీసుల ఎదుట తుపాను బాధితులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్‌, రెడ్డి శాంతి, తదితరులు ధర్నా నిర్వహించారు. పంట, ఆస్తినష్టం అంచనా వేసి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో దయనీయ పరిస్థితులు ఉన్నాయని, 9 రోజులైనా ప్రభుత్వం నుంచి సరైన సాయం అందలేదని తుపాను బాధితులు అన్నారు.

కనీస సౌకర్యాలైన తాగునీరు, ఆహారం కూడా ప్రభుత్వం కల్పించలేదని ఆందోళన చేశారు. తుపాను నష్టం అంచనా వేయడానికి అధికార బృందాలు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం జరిగి 9 రోజులైనా విద్యుత్‌ పునరుద్ధరించలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. పాతపట్నం మండలం కొరసవాడ, బురగాం వద్ద బాధితులు రాస్తారోకోకు దిగారు. దీంతో ఒడిశా, ఆంధ్రా మధ్య రాకపోకలకు అంతరాయమేర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement