తిరుపతి–వాస్కోడిగామా రైలు ప్రారంభం | Tirupati - vaskodigama train launch | Sakshi
Sakshi News home page

తిరుపతి–వాస్కోడిగామా రైలు ప్రారంభం

Dec 30 2016 2:16 AM | Updated on Jul 29 2019 7:35 PM

తిరుపతి–వాస్కోడిగామా(గోవా) మధ్య ఎక్స్‌ప్రెస్‌ రైలును రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గురువారం సాయంత్రం తిరుపతిలో ప్రారంభించారు.

తిరుపతి అర్బన్‌: తిరుపతి–వాస్కోడిగామా(గోవా) మధ్య ఎక్స్‌ప్రెస్‌ రైలును రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గురువారం సాయంత్రం తిరుపతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తిరుపతికి రైల్వే పరంగా తక్కువ ప్రాధాన్యత ఉండేదన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు.

కొత్త రైళ్లు వస్తున్నాయని, అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. ఎంపీ వరప్రసాద్‌ మాట్లాడుతూ తిరుపతి రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ, దక్షిణం వైపు టీటీడీ సహకారంతో చేపట్టనున్న రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement