పూండి :వజ్రపుకొత్తూరు మండలంలో టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, మా కార్యకర్తలపై దాడులకు పాల్పడి బెదిరిస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు అన్నారు. శనివారం మండలంలోని అక్కుపల్లి గ్రామంలో స్థానిక విలేఖరులతో మాట్లాడారు. టీడీపీ నాయకుల దాడులు ఎదుర్కొంటున్న అక్కుపల్లి మాజీ సర్పంచ్ లండ రామలింగంతో కలసి ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఎవరూ భయపడవద్దని సూచించారు. గ్రామంలో టీడీపీ నాయకుల అన్యాయూలను ఎదిరిస్తే చంపేస్తాం అని వాల్పోస్టర్స్ వేయించి మరీ బెదిరించడం టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు.
ఈ సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారా లేక అధికార పార్టీ నాయకులా అని జగన్నాయకులు ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఇదే వ్యవహారశైలి అనుసరిస్తే డీజీపీ, డీఐజీ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి కార్యకర్తలతో కలసి ప్రభుత్వ అరాచకాలను అరికట్టేందుకు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జగన్నాయకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బైపల్లి సర్పంచి, మడ్డు రాంప్రసాద్, ఎం. వరప్రసాద్, బి. భూపతి, అర్లి వల్లభరావు, పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ కౌన్సిలర్ ఎం. సురేష్, ఎస్.డిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మా కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించం
Published Sun, Aug 10 2014 2:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement