చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి | sailajanath takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి

Oct 18 2014 2:06 PM | Updated on Sep 2 2017 3:03 PM

చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి

చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు.

హైదరాబాద్ :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విశాఖకు వచ్చి ఏం చేస్తారన్న చంద్రబాబు వ్యాఖ్యలు సీఎం స్థాయికి సరికావని ఆయన అభిప్రాయపడ్డారు. కష్టాల్లో ఉన్నవారిని పరామర్శించటం పార్టీ నేతల బాధ్యత అని శైలజానాథ్ శనివారమిక్కడ అన్నారు. గతంలో చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకోవటానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పెను తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని శైలజానాథ్ విమర్శించారు.

హైదరాబాద్లో పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు నిమగ్నమయ్యారే తప్ప...తుఫాను ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టలేదన్నారు. అందుకే తీవ్ర నష్టం వాటిల్లిందని శైలజానాథ్ అన్నారు. ఒడిశా ప్రభుత్వం మాదిరిగా బాబు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.  ఆయన తీసుకున్న చర్యలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తుఫాను అంశాన్ని కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని శైలజానాథ్ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement