- ఐటీడీఏ వద్ద కొనసాగుతున్న దీక్షలు
- డీడీతో కొలిక్కిరాని చర్చలు
పాడేరు: ఆందోళనలో భాగంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతిగృహాల డైలీవైజ్, క్యాజువల్ వర్కర్లు శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. బకాయి వేతనాలు చెల్లించాలని, తమను రెగ్యులర్ చేయాలని, డైలీవైజ్ వర్కర్లు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు శనివారం రెండోరోజు కొనసాగాయి. రాస్తారోకో చేసిన హాస్టల్ వర్కర్లు తమకు పీఎఫ్, గ్రాడ్యుటీ, ప్రమాదబీమా, యూనిఫాం తదితర సౌకర్యాలు కల్పించాలని, కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, తొలగించిన క్యాజువల్ వర్కర్లను, హెల్త్ వలంటీర్ల్లనువిధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు.
దీక్షలకు పలు సంఘాల మద్దతు...
తమ డిమాండ్ల పరిష్కారం కోసం దీక్షలు చేపట్టిన హాస్టల్ వర్కర్లకు శనివారం పలు సంఘాలు మద్దతునిచ్చాయి. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.అప్పారావు, రూఢి అప్పారావు, కాంగ్రెస్ నాయకులు అశోక్, కెజియా, వుడా త్రినాథ్, గెమ్మెలి సర్పంచ్ అప్పలనాయుడు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు వి.భాగ్యలక్ష్మి, పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కె.అర్జున్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శంకురాజు ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించి హాస్టల్ వర్కర్ల ఆందోళనకు సంఘీభావం తెలిపారు.
డీడీతో చర్చలు విఫలం
హాస్టల్ వర్కర్ల సమస్యలపై గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్ ఎం.కమలతో శనివారం సీఐటీయూ నాయకులు ఉమా మహేశ్వరరావు, శ్రీను, హాస్టల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలన్నచర్చలు జరిపారు. హాస్టల్ వర్కర్ల సమస్యలపై డీడీ కమల స్పందిస్తూ డైలీవైజ్, క్యాజువల్ వర్కర్లకు వేతన బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని, తొలగించిన క్యాజువల్ వర్కర్లందరిని ప్రభుత్వ అనుమతితో విధుల్లోకి తీసుకుంటామని, కలెక్టర్ గెజిట్ ప్రకారం పెరిగిన వేతనాలను ఎరియర్స్తో సహా చెల్లిస్తామని యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు.
అలాగే పిఎఫ్, గ్రాడ్యుటీ, ఇన్సూరెన్స్ మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని, ప్రస్తుతం ఏజెన్సీలో పని చేస్తున్న 110 మంది డైలీవైజ్ వర్కర్లను రెగ్యులర్ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదించామని, ప్రభుత్వ అనుమతి రాగానే వీటిని పరిష్కరిస్తామని ఆమె వివరించారు. నోటిమాట సరిపోదని, ఈ హామీలపై రాతపూర్వకంగా తమకు ఇవ్వాలని, అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. దీంతో చర్చలు కొలిక్కి రాలేదు.
హాస్టల్ వర్కర్ల రాస్తారోకో
Published Sun, Jul 12 2015 1:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement