లోగుట్టు ఏమిటో..? | reservations are finalised | Sakshi
Sakshi News home page

లోగుట్టు ఏమిటో..?

Mar 7 2014 3:21 AM | Updated on Sep 2 2017 4:25 AM

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల జాబితా వివరాలను వెల్లడించడానికి జిల్లా పరిషత్ అధికారులు నిరాకరిస్తున్నారు.

 విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్:
 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల జాబితా వివరాలను వెల్లడించడానికి జిల్లా పరిషత్ అధికారులు నిరాకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జిల్లా పరిషత్ అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేసి వివరాలు వెల్లడించినప్పటికీ ఈ జిల్లాలో మాత్రం అధికారులు వివరాలు వెల్లడించడానికి అంగీకరించడం లేదు. కాంగ్రెస్ పార్టీ నేతల లబ్ధికోసం కొంతమంది అధికారులు వారికి అనుకూలంగా రిజర్వేషన్లు రూపొందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణం చేత నే రిజర్వేషన్లు వెల్లడించడానికి వెనుకాడుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
 
  రిజర్వేషన్ల జాబితా వివరాలను ఎన్నిమార్లు అడిగినప్పటికీ అధికారులు నిరాకరిస్తున్నారు. జిల్లాలో 34 జెడ్పీటీసీలు, 549 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి రిజర్వేషన్లు ఖరారుచేసి గురువారం సాయంత్రంలోగా పంచాయతీరాజ్ కమిషనర్ కు పంపించాలి. కానీ జిల్లా పరిషత్ అధికారు లు రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని చెబుతున్నారు. వాస్తవానికి ప్రక్రియ పూర్త్తయినప్పటికి అవకతవకలు బయటపడతాయేమోనన్న సందిగ్ధంతోనే అధికారులు జాబితా వెల్లడి కి అంగీకరించడం లేదని స్పష్టంగా తెలుస్తోం ది. ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లపై గతంలో 39 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 5 ఫిర్యాదులను మాత్రమే పరిష్కరించారు. దీంతో జెడ్పీ అధికారుల తీరుపై పత్రికల్లో పలు కథనాలు వచ్చా యి. ఈలోగా సమైక్యాంధ్ర ఉద్యమం రావడం తో అధికారుల తీరును మర్చిపోయారు. ఎంసీటీసీల రిజర్వేషన్లనుఅధికార పార్టీ నేతలకు అనుకూలంగా సమకూర్చారనే విమర్శలు ఉ న్నాయి. పక్క జిల్లాలో జాబితా వెల్లడించినప్పటికీ ఇక్కడి అధికారులకు ఉన్న అభ్యంతరం ఏమిటో అంతుపట్టని విషయం.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement