మంత్రి లోకేశ్‌కు చేదు అనుభవం | Minister Nara lokesh faces bitter experience | Sakshi
Sakshi News home page

మంత్రి లోకేశ్‌కు చేదు అనుభవం

Jun 20 2017 2:48 PM | Updated on Aug 29 2018 3:37 PM

మంత్రి లోకేశ్‌కు చేదు అనుభవం - Sakshi

మంత్రి లోకేశ్‌కు చేదు అనుభవం

ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది.

విజయవాడ: ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు, కృష్ణాజిల్లా సుబాబుల్‌ రైతులు మంగళవారం మంత్రి లోకేశ్‌ను కలిశారు. మూడేళ్ల నుంచి తమ డబ్బుల కోసం మార్కెట్‌ యార్డ్‌ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక‍్తం చేశారు. ఇవాళ, రేపు డబ్బులు ఇస్తామని తిప్పుతున్నారంటూ రైతులు ఆవేదన చెందారు.

310మంది రైతులకు  సుమారు రూ.10 కోట్లు వరకూ రావాలని వారు తెలిపారు. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు కంటతడి పెట్టారు. తమ బాధలు చెప్పుకుంటున్న రైతులపై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత సమయం ఓపిక పట్టాలని ఆయన రైతులకు సూచించారు. అయితే ఇంకెంతకాలం తాము ఓర్పుగా ఉండాలని రైతులు...మంత్రి లోకేశ్‌ను సూటిగా ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement