సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మాట్లాడిన జాలి మాటలన్నీ బూటకమని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఆయన నటిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. సమైక్యం ముసుగులో ఉన్న విభజనవాది కిరణ్ అని తూర్పారబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు విలేకరులతో మాట్లాడారు. సమైక్య ఉద్యమాన్ని సీఎం కిరణ్ నీరుగారుస్తూ, విభజనకు తీవ్రంగా కృషి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ల మధ్య రాష్ట్రంలో దోబూచులాట జరుగుతోందని, ఆ రెండు పార్టీలు తమ వైఖరితో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
వరదల వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని పరామర్శించడానికి వెళ్లిన తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు ప్రజల నుంచి ఆదరణ లభించే సరికి పోలీసుల చేత అడ్డుకున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును మాత్రం 300 మంది పోలీసులతో ప్రత్యేకమైన భద్రత మధ్య రెడ్కార్పెట్ వేసి తీసుకెళ్లారని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. చంద్రబాబు మీద కాంగ్రెస్కు ఎందుకింత ప్రేమో ప్రజలందరికీ తెలుసన్నారు. సమైక్య రాష్ట్రంలో జీతాలు తీసుకుంటున్న మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్కుమార్లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరుపట్ల తాను వేసిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం చెప్పలేదన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ, పౌరహక్కులను కాలరాసిన ఇద్దరు మంత్రులను సీఎం ఎందుకు భర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. దీన్ని చూస్తే కిరణ్ ఎంత విభజన వాదో స్పష్టంగా అర్థమవుతుందన్నారు.
Breadcrumb
కిరణ్ పక్కా విభజన వాది: గట్టు
Published Mon, Nov 4 2013 12:35 AM
Related news
-
కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుపై మిథున్ రెడ్డి సీరియస్ కామెంట్స్
కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుపై మిథున్ రెడ్డి సీరియస్ కామెంట్స్ -
కిరణ్కుమార్ను చిత్తుగా ఓడిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కారణమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, పెద్దిరెడ్డి శుక్రవారం పుంగనూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి. విద్య, వైద్యం కోసం వేల కోట్లు రూపాయలు ఖర్చు చేసి సీఎం జగన్ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పేద కుటుంబాలు వైద్యం కోసం ఖర్చు చేసే పనిలేకుండా ముఖ్యమంత్రి జగన్ బాధ్యత తీసుకున్నారు. సీఎం జగన్ను మళ్లీ గెలిపించి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకే కుటుంబం ఇక్కడ 30 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపించాం. త్వరలోనే ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందిస్తాం. మే 13న జరిగే ఎన్నికల్లో నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నాను. మీ ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ విజయానికి మనమంతా కృషి చేయాలి. ఇదే సమయంలో.. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఓడించాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఓడిస్తాం. చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం వైఎస్ జగన్ను వేధించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు. కిరణ్ కుమార్ నమ్మకద్రోహి’ అంటూ కామెంట్స్ చేశారు. -
నల్లారి కిరణ్పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
సాక్షి, అనంతపురం: చంద్రబాబుకి రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు అయినా చంద్రబాబు కట్టడా? అంటూ ప్రశ్నించిన పెద్దిరెడ్డి.. సీఎం జగన్ రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ‘‘చంద్రబాబుని కుప్పంలో కూడా ఒడిస్తాం. కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చింది సీఎం జగన్. సొంత జిల్లాకి కూడా మేలు చేయని వ్యక్తి చంద్రబాబు. అమిత్ షా కాళ్లు పట్టుకుని బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు బీజేపీనే పొత్తు అడిగిందని అబద్దాలు చెప్తున్నాడు’’ అంటూ పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ‘‘కిరణ్కుమార్ రెడ్డికి నా గురించి మాట్లాడే అర్హత లేదు. ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కిరణ్ కుమార్రెడ్డిది. ఎన్నికలు అవ్వగానే కిరణ్ కుమార్రెడ్డి సూట్ కేసు సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోతాడు. సీఎం పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం జగన్ని అణగదొక్కడానికి సోనియాగాంధీతో కుమ్మక్కయ్యాడు. ఇప్పుడు మేము ఓడించి బుద్ధి చెప్తాము’’ అని పెద్దిరెడ్డి అన్నారు. ‘‘సీఎం జగన్ బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోంది. నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని జనం బస్సు యాత్రలో కనిపిస్తున్నారు. 175 సీట్లు గెలుస్తామన్న నమ్మకం బస్సు యాత్రతో కలిగింది’’ అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. -
ఇలాంటి పాలకులు అవసరమా?
వికారాబాద్: ‘అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే.. డిసెంబర్ 9న లాల్బహదూర్ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణం స్వీకారం చేయటం ఖాయం. ఆ రోజే ఆరు గ్యారంటీ స్కీంలపై తొలి సంతకం చేసి, తెలంగాణ ప్రజ లకు సోనియమ్మ, మల్లికార్జున ఖర్గే ఇచ్చిన హామీలను నేరవేరుస్తాం..’అని పీసీసీ అధ్య క్షుడు రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగం కోసం చదివి చదివి వేసారిపోయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే.. అసలు ఆమె దరఖాస్తే చేసుకోలేదని నిందలు వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆడబిడ్డపైన నిందలేయటానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పాలకులు అవసరమా? మనకు అని ప్రజలను ప్రశ్నించారు. సోమవారం రాత్రి వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిండా ముంచారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని రేవంత్ గుర్తుచేశారు.. అందుకే తాము కూడా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచార శంఖారావం పూరిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తే.. మనం వికారాబాద్ నుంచి విజయోత్సవ సభలు మొదలు పెడుతున్నామని అన్నారు. కేసీఆర్కు హుస్నాబాద్ కలిసొస్తదో.. కాంగ్రెస్కు వికారాబాద్ కలిసొస్తదో తేల్చుకుందాం అని సవాలు విసిరారు. అమరుల త్యాగాలకు చలించిపోయిన సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్ ప్రజలను నిండా ముంచారని ఆరోపించారు. నాడు వైఎస్సార్ ప్రాణహిత ప్రాజెక్టును డిజైన్ చేసి ప్రారంభించడంతో పాటు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశారని, కేసీఆర్ మాత్రం ప్రాజెక్టు డిజైన్ మార్చేసి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీళ్లిస్తామని కల్లబోల్లి మాటలతో కాలయాపన చేయడం తప్ప ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతానికి ఏమైనా ఆంధ్రోడు సీఎంగా ఉన్నా డా? లేక పక్క రాష్ట్రపోడు సీఎంగా ఉన్నాడా? అని ధ్వజమెత్తారు. తొలుత ఎన్నెపల్లిలోని సయ్యద్ యాసిన్, మాణెమ్మ, యాదయ్య ఇళ్లకు వెళ్లిన రేవంత్ ఆరు గ్యారంటీ పథకాల గురించి వివరించారు. తెల్ల రేషన్కార్డు ఉన్న పేదలందరికీ వీటిని వర్తింపజేస్తామని తెలిపారు. మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్కుమార్, ఎ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్రెడ్డిలు పాల్గొన్నారు. -
తొలిసారి హైదరాబాద్ గడ్డపై సీడబ్ల్యుసీ సమావేశం
తొలిసారి హైదరాబాద్ గడ్డపై సీడబ్ల్యుసీ సమావేశం
Related News by category
-
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
ఊరూరా కళ్లెదుటే మార్పు ‘ప్రభుత్వ ఆస్పత్రులు బాగుండవని చాలా మంది అనుకుంటారు. మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్ థియేటర్స్లో కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్ స్పెషల్ ఐసీయూ, సొంత ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు’ అంటున్నారు సినీ దర్శకుడు, రచయిత కోన వెంకట్. చిన్న చిన్న గ్రామాల్లో కూడా హెల్త్ క్లినిక్స్, రూపురేఖలు మారిపోయిన పాఠశాలలు, డిజిటల్ బోధన కళ్లెదుటే కనిపిస్తోందని స్పష్టం చేస్తున్నారు. కళ్లెదుటే ఇంత మార్పునకు కారణం ముమ్మాటికీ సీఎం జగనే అని నొక్కి చెబుతున్నారు. ‘చెడు త్వరగా ప్రచారంలోకి వస్తుంది. అది వినడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు. మంచి చెబితే ఏదో ఆశించి భజన చేస్తున్నాం అంటారు. అంటే అనుకోనీయండి. కానీ నిజం చెప్పకపోవడం అంటే అబద్ధాన్ని ప్రోత్సహించడమే అని నా అభిప్రాయం. అందుకే నేను నిజాలు చెబుతున్నాను’ అంటున్నారు సినీ దర్శక, రచయిత కోన వెంకట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరిశీలించి, వాటి గురించి ససాక్ష్యంగా వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షితో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. –సత్యార్థ్ బాపట్ల జిల్లా కర్రపాలెం మండలంలోని మారుమూల గణపవరం అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించా. అక్కడి పిల్లలతో కలిసి నిమ్మకాయ పులిహోర తిన్నా. రాగిజావ తాగా. ఉచితం అంటే ఎలా ఉంటాయో అని మనం అనుకుంటాం. కానీ మన అంచనాలన్నీ తప్పని అక్కడ ఆహారం తిన్నాక స్పష్టమైంది. అక్కడి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే పదార్థాలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. అంతేకాదు ట్యాబ్స్, స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్, షూ, సాక్స్... అన్నీ నాణ్యమైనవే ఇచ్చారు. పాఠశాల వాతావరణం బాగుంటే సానుకూల ఫలితాలు వస్తాయి కదా... అదే ఇప్పుడు కనిపిస్తోంది. మేం చదువుకున్నప్పుడు ఇలాంటి వసతులు, సౌకర్యాలు ఉంటే మరింత బాగా రాణించేవాళ్లం కదా అనిపించింది. టీచర్లు, సిబ్బంది కూడా కొత్త ఉత్సాహంతో కనిపించారు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే అప్పటికప్పుడు ఆ టీచర్లు అందరికీ శాలువాలు తెప్పించి సన్మానించాను. పల్లెలకు చికిత్స ప్రభుత్వ ఆస్పత్రులు.. అదీ మారుమూల గ్రామంలో ఎలా ఉంటాయో అనే దానిపై మనం ఒక మైండ్ సెట్తో ఉంటాం. అయితే మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్ థియేటర్స్లో కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్ స్పెషల్ ఐసీయూ. అంతేకాదు.. సొంత ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు. నేను వచ్చింది ప్రభుత్వ ఆస్పత్రికా, లేక కార్పొరేట్ ఆస్పత్రికా అన్న ఆశ్చర్యం కలిగింది. కొన్నేళ్ల క్రితం వరకూ గర్భిణులు సైతం డెలివరీల కోసం చీరాల, తెనాలి అంటూ పొరుగూళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడిక ఆ సమస్య లేదు. ఇక మరో మారుమూల ఉన్న కొత్త నందాయపాలెం అనే చిన్న గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ చూశా. అదీ అద్భుతం అనే చెప్పాలి. ఆ హెల్త్ క్లినిక్లో ల్యాబ్ కూడా పెట్టారు. అక్కడికక్కడ రక్త పరీక్షలు, బీపీ, షుగర్ టెస్ట్లు చేస్తూ మందులు ఇస్తున్నారు. అక్కడ సేవలందించే డాక్టర్స్ విశ్రాంతి తీసుకోవడానికి క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేశారంటే ఎంత పక్కా ప్రణాళికతో ఈ విలేజ్ క్లినిక్స్ని డిజైన్ చేశారో ఆలోచించండి. నా కళ్లు నేనే నమ్మలేనంత గొప్పగా ఇళ్లు పేదలకిచ్చిన ఇళ్లను గమనించడానికి మాకు సమీపంలో ఉన్న జగనన్న కాలనీలను సందర్శించా. చెబుతుంటే అతిశయోక్తిలా ఉంటుందేమో. హైదరాబాద్లోని గచ్చి»ౌలిలో ఉన్న విల్లా కమ్యూనిటీలాగా అనిపించింది. అది కూడా ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టు కట్టిన కాలనీ కాదు. బాపట్ల ఎంట్రన్స్లో హైవే పక్కనే కట్టించి ఇచ్చారు. కేవలం ఇళ్లు ఇవ్వడమే కాదు చక్కగా, పరిశుభ్రంగా అన్ని వసతులతో నిర్వహిస్తున్నారు. అక్కడ తాపీ పనిచేసే ఒక ముస్లిం కుటుంబంతో పాటు అనేక మందితో ముచ్చటించినప్పుడు వాళ్ల కళ్లల్లోని ఆనందాన్ని చూస్తే పేదలకు ఇంతకన్నా మేలు చేసే ప్రభుత్వం ఉంటుందా? అనిపించింది. ఎందుకంటే వాళ్ల జీవితంలో ఇలాంటి ఇళ్లు కట్టుకోవడం అసాధ్యం. నాకు కూడా అలాంటి చోట ఒక ఇల్లు ఉంటే బాగుండు అన్నంత బాగుంది. రోడ్లపై జరుగుతోంది దు్రష్పచారమే...రహదారుల విషయంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం జరుగుతోంది. దీనిని నిర్ధారించుకోవడానికి నేను మా ఊరి చుట్టుపక్కల రహదారుల్ని సర్వే చేశాను. అదంతా అబద్ధమేనని తేలింది. మీరు నమ్ముతారా? మా బాపట్లకి అవుటర్ రింగ్ రోడ్ కూడా ఉంది. ఇక గ్రామ సెక్రటేరియట్స్, రైతు భరోసా కేంద్రాలు కూడా త్వరలో సందర్శిస్తాను. ఆం«ధ్రప్రదేశ్లో జరుగుతున్న మంచిని కనపడనీయకుండా, వినపడనీయకుండా చేయాలనే ఆలోచనతో విపక్షాలు, జగన్ శత్రువులు కుట్ర చేస్తున్నారు. నేను రాష్ట్రం మంచి కోరుకునే ఆంధ్రప్రదేశ్ పౌరుడ్ని. వృత్తి, వ్యాపకాల రీత్యా నేనెక్కడ స్థిరపడినా నా ఊరు బాగుపడుతుంటే ఆ ఊరంటే ప్రేమ ఉన్న నేనెందుకు గర్వంగా చెప్పుకోకూడదు? ఎవరేమనుకున్నా సరే.. నాకు కనపడిన మంచిని ప్రజలతో పంచుకుంటా. చిత్తశుద్ధి ఉన్న సీఎం గెలవాలి... వైఎస్సార్సీపీయా... బీజేపీయా... కాదు. పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న జగన్ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఆయనకు ఆ అవసరం లేకపోవచ్చు. నాన్న వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని తప్ప మరో కోరిక ఉండకపోవచ్చు. కానీ ఆయన సీఎంగా ఉండడం, మళ్లీ గెలవడం ఈ రాష్ట్రానికి... ముఖ్యంగా పేదలకు అవసరం. ఇలాంటి పాలన నిజంగా పేదలకు ఓ వరం. -
సర్కారు ఊతంతో పూల బాట
నవరత్నాల పేరుతో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుతు న్నాయి. లక్షలాది మంది జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. తిరుపతి జీవకోనలోని రాఘవేంద్ర నగర్కు చెందిన వెంకటేష్, మునీశ్వరి కుటుంబమే ఇందుకు నిదర్శనం వెంకటేష్ 2019కి ముందు భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తూ చాలీ చాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుండేవారు. పని దొరికిన రోజు వచ్చే కూలి రూ.400తో ఆ కుటుంబంలోని ఆరుగురు జీవించాల్సి వచ్చేది. ఆయన భార్య మునీశ్వరి గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ముగ్గురు పిల్లలను చదివించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు తప్ప ఎలాంటి పథకాలు అందలేదు. మునీశ్వరి అత్తమ్మకు పింఛన్ కూడా వచ్చేది కాదు. జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగే లా తిరిగినా ఫలితం లేకపోయింది. పిల్లలను చది వించగలమా అనే బెంగతో ఉండేవారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ప్రవేశపెట్టిన నవరత్నాలతో ఆ కుటుంబానికి భరోసా లభించింది. వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, ముగ్గురు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి, కుటుంబంలోని మునీశ్వరి అత్తమ్మకు వృద్ధాప్య పింఛన్ లభిస్తోంది. ప్రస్తుతం ఒక కుమార్తె ఇంజినీరింగ్ పూర్తి చేసింది, మరో కుమార్తె డిగ్రీ పూర్తి చేసింది. వీరిద్ధరూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కూలిపని మానేసి చెన్నై నుంచి ముడిసరుకు తెప్పించుకుని గృహాలకు ప్లాస్టిక్ పూల తోరణాలు, దేవుని చిత్రపటాలకు అవసరమైన పలు రకాల రంగులతో మాలలు, ప్లాస్టిక్ పూలతో షోకేజ్ డెకరేషన్ బొకేలు తయారు చేస్తూ మరో ఆరు మంది మహిళలకు ఉపాధి కబ్ధి స్తున్నారు. –తిరుపతి సిటీ\తలసరి ఆదాయం పెరిగింది గతంలో నిరుపేద మహిళలు కూలి పనులు చేసుకుంటూ లేదా ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. పిల్లలను చదివించలేక పోవడంతో వారు షాపుల్లో పనులు చేసుకుంటూ మంచి భవిష్యత్తు కోల్పోయి జీవితాలను సర్వనాశనం చేసుకునేవారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయి. వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ఇది కాదనలేని నిజం. అమ్మ ఒడి, ఫీజురియింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. –జి సవరయ్య, రిటైర్డ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతివైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మునీశ్వరి కుటుంబానికి కలిగిన లబ్ధి వైఎస్సార్ ఆసరా రూ.68,000 వైఎస్సార్ చేయూత రూ.75,000 జగనన్న విద్యాదీవెన రూ.28,000 వసతి దీవెన రూ.20,000 అమ్మ ఒడి రూ.30,000 సున్న వడ్డీ రూ.2,250 పింఛన్ కానుక రూ.96,000 మొత్తం రూ.3,19,250 -
నల్లమలకూ ఓ వీరప్పన్!
విలువైన కలపను టోకుగా కాజేశాడా నేత.. నల్లమల వీరప్పన్గా పేరుమోశాడాయన.. నాటుసారా వ్యాపారంలో అందెవేసిన చేయి.. తన సారా వ్యాపారానికి అడ్డొచ్చి న వారి అంతు చూడడానికి సైతం వెనుకాడనంత దౌర్జన్యపరుడు.. ఈ అక్రమాలన్నిటితో రూ.వేల కోట్లను అనతికాలంలోనే ఆర్జించి.. తన దోపిడీ సామ్రాజ్యాన్ని బలపరుచుకున్న నేత.. అక్కడి జనాన్ని తన కంటి చూపుతో శాసించారు.సారా వ్యతిరేకోద్యమం ముమ్మరంగా రాష్ట్రంలో ఊపేస్తే.. అప్పటి ఈ టీడీపీ నేత నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఈయనకు వ్యతిరేకంగా గొంతెత్తడానికి సాహసించలేకపోయారంటే జనాన్ని ఎంతగా భీతిగొలిపారో అర్థం చేసుకోవచ్చు. తుదకు తనఅక్రమాలకు మద్దతిచ్చే టీడీపీలో చేరారు.. అదొక్కటే కాదు.. అవకాశవాదంతో ఏ ఎండకా గొడుగు పడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోనూ చేరారు.. ఈ నేత నీడన పెరిగిన ఆయన తనయ ప్రస్తుతం టీడీపీ లోక్సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.సాక్షి, టాస్్కఫోర్స్: ఆ పేరు వింటే చాలు నల్లమల వీరప్పన్ గుర్తుకు వస్తారు. కొన్నేళ్ల కిందట నల్లమల అడవిని అడ్డాగా చేసుకుని తన వ్యాపారాన్ని సాగించారు. కలప చెట్లను ఇష్టానుసారం నరికి హైదరాబాద్కు తరలించి రూ. వేల కోట్లు సంపాదించారు. తనకు ఎదురుమాట్లాడితే వారి పని అంతే. అడ్డుకుందామని యతి్నంచిన అధికారులను నయానో భయానో లొంగదీసుకుని తన వ్యాపారాన్ని సాగించారు. అంగబలానికి తోడు అర్ధబలం తోడవడంతో ఆయన అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయింది. తండ్రి రాజకీయ అండతో..: తండ్రి రాజకీయ అండతో ఈ నేత విచ్చలవిడిగా సంపాదించారు. జూపాడుబంగ్లా, పగిడ్యాల, మిడుతూరు, ఓర్వకల్లు మండలాల్లో సొంతంగా సారా అంగళ్లు తెరిచారు. పల్లెలకు సారాను పరిచయం చేశారు. సారా వల్ల అనేక వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సారా అంగళ్లను తమ గ్రామాల్లో తొలగించాలని మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా, తన అంగబలంతో వాటిని అణచివేశారు.1989లో రాష్ట్ర వ్యాప్తంగా సారాకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. రోడ్ల మీదకి వచ్చి తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న సారా రక్కసిని పారదోలాలని రాష్ట్రమంతటా నినదించారు. ఒక్క నందికొట్కూరు నియోజకవర్గంలో మాత్రమే సారా ఉద్యమం చేయాలంటే గజగజ వణకాల్సిన పరిస్థితిని ఈ నేత సృష్టించారు. ఉద్యమం చేస్తే తమను ఏం చేస్తారోనన్న భయం నియోజకవర్గ ప్రజలను వెంటాడింది. ఉద్యమం పెద్ద ఎత్తున ఎగసిపడిన రోజుల్లోనూ స్థానికంగా మాత్రం సారా వ్యాపారం విచ్చలవిడిగా సాగిపోయింది. రూ.కోట్లలో విభేదాలతో బయటకు... 1993లో ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డితో సారా కాంట్రాక్టు విషయంలో ఈ నేతకు విభేదాలు వచ్చాయి. తన సారా వ్యాపారానికి సహకరించడంలేదన్న కోపంతో ఆయన టీడీపీలో చేరి 1994లో నందికొట్కూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అక్షరాస్యత పెద్దగా లేని నాటి రోజుల్లో అమాయక ప్రజలను తన రాజకీయ లబ్ధి కోసం ఈ నేత వాడుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు చేపట్టి ఎంతో మంది మహిళల పుస్తెలు తెంపిన ఘన చరితా ఈయనదేనన్న ఆరోపణలు ఉన్నాయి. రెండోసారి ఎన్నికవడంతో.... 1999 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ నేత ఆగడాలు శృతిమించాయి. నల్లమల అడవిని చెరబట్టి అటవీ సంపదను కొల్లగొట్టారు. విలువైన కలపను ఇతర ప్రాంతాలను రవాణా చేసి రూ.కోట్లు గడించారు. అటవీ అధికారులను బెదిరించి విలువైన కలప చెట్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు తరలించి రూ.వేల కోట్లు సంపాదించారు. ఆ నేత ఇంటిలో, హైదరాబాద్లోని హోటల్లో ఎక్కడ చూసినా విలువైన కలప కళాఖండాలు కనిపిస్తాయని ఉమ్మడి కర్నూలు ప్రజలందరికీ తెలుసు. బీడీల కట్టలు కట్టి అమ్ముకునే నిరుపేదల రక్తం తాగారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల నుంచి కారుచౌకగా బీడీ కట్టలను కొనుగోలు చేసి తాను మాత్రం ఎక్కువ రేటుకు విక్రయించి లాభాలు గడించారు. ఆ నేతకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఆయన ఆగడాలను ప్రశి్నంచినా వారికి భూమ్మీద నూకలు చెల్లినట్లే. ఈ నేతకు విలేకరులంటే అలుసు. అప్పట్లో విలేకరుల సమావేశాలంటూ పిలిచి కురీ్చలు కూడా వేసేవారు కాదు. పాత్రికేయులు నిలుచునే ఆయన చెప్పేది నోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా కేంద్రాలలో ఉండే ముఖ్య ప్రతినిధి వస్తే మాత్రమే కుర్చీ వేసేవారు. ∗ 2004లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈ నేత వరుసగా పార్టీలు మారారు. కొద్ది రోజులు రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో హడావుడి చేశారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లోకి ఆయన వెళ్లొచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతూ ఊసరవెల్లి రాజకీయాలు సాగించిన ఘనత దక్కుతుంది. కేసులు.. వ్యక్తిని అక్రమంగా నిర్బంధించడంతో ఆయనపై ఐపీసీ 341 కింద నియోజకవర్గంలో కేసు నమోదైంది. ఐపీసీ 143, 188, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న తనయతండ్రికి తానేమీ తక్కువకాదన్నట్లుగా ఆయన తనయ వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఈమె నోరు తెరిస్తే చాలు అవతలి వ్యక్తి హడలిపోవాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లెలో ఈమెపై క్రిమినల్ కేసు నమోదైంది. దళిత వ్యక్తిని దూషించడంతో పాటు దాడి చేయడంతో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈమె టీడీపీ తరఫున లోక్ సభకు పోటీ చేస్తున్నారు. -
బిందువే సిరుల సింధువు
సాక్షి, అమరావతి : అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం పోళ్లోపల్లి రైతులను వర్షాభావం ఏళ్ల తరబడి పట్టి పీడించింది. అక్కడి రైతులు రాగి, సజ్జలు, ఉలవలు, అలసందలు, పెసర, మినుములు, పొద్దు తిరుగుడు మినహా ఇతర పంటలను సాగు చేయరు. కరవు కాటకాల వల్ల ఆరు తడి పంటలు సైతం ఏనాడూ పూర్తిగా చేతికందని దుస్థితి. గత్యంతరం లేక బతుకుదెరువు కోసం కొందరు కువైట్కు మరికొందరు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు.దశాబ్దాల పాటు ఊళ్లో యువకులెవరూ కానరాని విచిత్రం ఆ ఊరి సొంతం. ఈ గ్రామంలో 1,800 కుటుంబాల్లో 134 మంది రైతులుండేవారు. సేద్యం కలిసిరాక 100 మందికి పైగానే గ్రామం నుంచి వలస వెళ్లారు. అప్పో సప్పో చేసి సేద్యం చేసే వారి సంఖ్య 30కి మించి ఉండేదికాదు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడా గ్రామంలో మోటారు సైకిల్ లేని ఇల్లు లేదు. ప్రతి పదిళ్లకూ ఒక కారు ఉంది. పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు.ఒకప్పుడు ఈ ఊరి యువకులకు పిల్లనివ్వడానికే సంకోచించేవారు. ఇప్పుడు సంబంధాలు కుదుర్చుకోవడానికి పోటీ పడుతున్నారు. ఎందుకింత మార్పు అంటే..? సంక్షేమం ఆ గ్రామంలో ప్రతి తలుపూ తట్టింది. సేద్యంలో ఆ ఊరు గెలిచింది. సేద్యం లాభదాయకంగా మారి వలసలకు పగ్గాలు వేసింది. వేసిన పంటలు చేతికందుతున్నాయి. పెట్టుబడి పదింతలు మిగులుతోంది. పోళ్లోపల్లి రూపురేఖలను బిందుసేద్యం మార్చేసింది. కువైట్ నుంచి 90 శాతం స్వగ్రామానికి..ఒకప్పుడు అక్కడ పంటలకు నీటితడులు పెట్టేందుకు రాత్రనకా, పగలనకా చెలగ పార చేత పట్టుకుని పొలాల్లోనే కాపురాలు పెట్టేవారు. మోటారు కరెంటు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. పంటలు పండించడానికి ఇంటిల్లిపాదీ కష్టపడే వారు. ఇప్పుడు పగటి పూటే 9 గంటల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు అందుతుండడంతో నీటి తడుల కోసం బెంగలేకుండా పోయింది. కావాల్సినంత నీరందుతోంది. సూక్ష్మ సేద్యానికి సంక్షేమం తోడవడంతో వలస వెళ్లిన వారిలో నూటికి 90 మంది తిరిగి స్వగ్రామం బాటపట్టారు. ప్రస్తుతం ఆ గ్రామంలో రైతుల సంఖ్య 230కి పెరిగింది. ఒకప్పుడు సొంత పొలాలనే ఖాళీగా వదిలేసిన రైతులు ఇప్పుడు పక్క ఊళ్లోని పొలాలనూ కౌలుకు తీసుకుని సిరుల పంటలు పండిస్తున్నారు. 90 శాతం సబ్సిడీ (రూ.1.50 కోట్లు)తో నూరు శాతం విస్తీర్ణం (280 ఎకరాలు)లో బిందు పరికరాలను అమర్చుకున్నారు. బొప్పాయి, అరటి, జామ, సీతాఫలం.. ఇలా వివిధ రకాలను సాగు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. సంక్షేమంతో గ్రామానికి రూ.7 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా, పంట నష్టపరిహారం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ వంటి రైతు సంక్షేమ పథకాలతో పాటు అమ్మఒడి, చేయూత, ఆసరా లాంటి డజనుకు పైగా సంక్షేమ పథకాల రూపంలో గ్రామస్తులు రూ.7 కోట్లకు పైగా లబ్ధి పొందారు. ఫలితంగా వారిలో కొనుగోలు శక్తి పెరిగి పల్లె రూపురేఖలు మారాయి. సూక్ష్మసేద్యంతో ప్రభుత్వం తోడుగా నిలబడడంతో నాలుగేళ్లలో సుమారు రూ.1,500 కోట్లతో 6 లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాలను అమర్చుకుని 2.25 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 7.33 లక్షల ఎకరాలకు విస్తరణ రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. రాష్ట్రంలో మరో 28 లక్షల ఎకరాలు బిందు, తుంపర సేద్యానికి అనువైనదిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ ఐదేళ్లలో 7.33 లక్షల ఎకరాలను కొత్తగా సాగులోకి తీసుకొచ్చి 2.60 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. సబ్సిడీ రూపంలో రూ.2,669.85 కోట్లు జమ చేసింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.800.16 కోట్లూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో సిఫార్సులున్న వారికే పరికరాలు ఇచ్చేవారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వంలో అర్హతే కొలమానంగా అడిగిన ప్రతి రైతుకు సిఫార్సులకు తావులేకుండా, కుల, రాజకీయ పక్షపాతం లేకుండా అర్హులందరికీ పరికరాలిచ్చారు. రైతులు తమ వాటా చెల్లించిన 15 రోజుల్లోగానే నేరుగా వారి క్షేత్రాలకు పరికరాలను తీసుకెళ్లి మరీ అమర్చారు. ఈ పథకం కింద లబ్ధి పొందే ఎస్సీ, ఎస్టీ రైతులకు మేలు చేసేందుకు తుంపర, బిందు పరికరాలపై కేంద్రం విధించే 12 శాతం జీఎస్టీలో 50 శాతం పన్నుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా రూ.60 కోట్లకు పైగా జీఎస్టీ భారాన్ని రైతుల తరపున ప్రభుత్వం భరించింది. రైతులకు రూ.1,034 కోట్ల పెట్టుబడి ఆదా సూక్ష్మసేద్యంలో గతేడాది జాతీయ స్థాయిలో ఐదవ స్థానంలో ఉన్న ఏపీ ఈ ఏడాది 4వ స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యుత్తమ 20 జిల్లాల్లో ఐదు జిల్లాలు (ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి) ఏపీకి చెందినవే. బిందు, తుంపర సేద్యంపై ఆర్బీకేల ద్వారా, ఆర్బీకే చానల్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎరువుల యాజమాన్యం, విద్యుత్ ఆదా, కూలీల ఖర్చు, నీటి ఆదాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ పథకం విస్తరణ ద్వారా 36,650 టన్నుల ఎరువులు, 11,383 లక్షల యూనిట్ల విద్యుత్, 110 టీఎంసీల నీరు ఆదా కాగా, రైతులకు రూ.1,034 కోట్ల కూలీల ఖర్చు మిగిలిందని గుర్తించారు. కువైట్ను వీడి కన్నతల్లి ఒడికి.. పోళ్లోపల్లికే చెందిన సంగరాజు చంద్రశేఖర్రాజు సేద్యం కలిసి రాకపోవడంతో 17 ఏళ్ల క్రితం కువైట్ వెళ్లి అక్కడే ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మూడేళ్ల క్రితం గ్రామానికి తిరిగి వచి్చన ఆయన 90 శాతం ప్రభుత్వ సబ్సిడీతో డ్రిప్ ఏర్పాటు చేసుకున్నారు. 2.5 ఎకరాల్లో పచ్చ అరటి సాగు చేశారు. రూ.1.50 లక్షలు వ్యయం కాగా , రూ.6 లక్షల ఆదాయం వచి్చంది. మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని అమృతపాణి, సుగంధ అరటి, డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. రైతు భరోసా సహా వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.2.56 లక్షలు అందాయి. ‘ఇద్దరు పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివిస్తున్నా. ఇక సేద్యం వదిలి పెట్టను. ఊళ్లోనే దర్జాగా జీవిస్తా’..నంటూ ధీమాగా చెబుతున్నారాయన. పిల్లలకు కార్పొరేట్ చదువులు.. వ్యవసాయం కలిసిరాక కువైట్ వెళ్లిన నా భర్త సుబ్బరాజు మూడేళ్ల కిందట సొంతూరొచ్చారు. 5 ఎకరాల్లో తైవాన్ జామ, మరో 5 ఎకరాల్లో అరటి, బొప్పాయి సాగు చేపట్టాం. ప్రభుత్వ సబ్సిడీతో ఫారం పాండ్తో పాటు 90 శాతం సబ్సిడీపై రూ.1.30 లక్షల విలువైన డ్రిప్ పరికరాలు తీసుకున్నా. జామకు రూ.3 లక్షలు ఖర్చు చేస్తే రూ.15 లక్షల ఆదాయం వచి్చంది. మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకుని అమృతపాణి జి–9 రకాన్ని వేశాం. రైతు భరోసా, సున్నా వడ్డీ, అమ్మఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా రూ.1.13 లక్షల ఆరి్థక సాయం అందింది. బిందు సేద్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు తోడవడంతో అమ్మాయిని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలోనూ, ఇద్దరు కుమారులను కార్పొరేట్ విద్యాసంస్థలో చదివిస్తున్నా. -ఉమ్మలరాజు సుజాత సమాజంలో గౌరవం పెరిగింది.. దినసరి కూలీగా పనిచేస్తూ ఐటీఐ చదువుకున్నా. ఉద్యోగం పేరిట మోసపోవడంతో కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకున్న 4 ఎకరాలకు 90 శాతం సబ్సిడీపై రూ.2 లక్షల విలువైన డ్రిప్ పరికరాలు సమకూర్చుకున్నా. బొప్పాయిలో మేలైన రెడ్ లేడీ రకం సాగు చేశా. ఏడాదిలో రూ.15 లక్షల ఆదాయం వచి్చంది. రైతుభరోసా, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, ఆసరా పథకాల ద్వారా రూ.65 వేల వరకు లబ్ధి పొందాం. ఆర్థిక పరిస్థితి‡ మెరుగుపడడంతో సమాజంలో గౌరవం పెరిగింది. –పందేటి కృష్ణమరాజు పిల్లలను మోడల్ స్కూల్లో చదివిస్తున్నా.. 4.5 ఎకరాల్లో డ్రిప్ పరికరాల కోసం దరఖాస్తు చేస్తే 90 శాతం సబ్సిడీపై 2.61 లక్షల విలువైన డ్రిప్ పరికరాలు అమర్చారు. కోలియోసిస్ అనే మెడిసిన్ ప్లాంటేషన్ చేశా. ఎకరాకు సగటున రూ.15 వేలు ఖర్చు చేశా. రూ.2.80 లక్షల ఆదాయం వచి్చంది. డ్రిప్తో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని నిమ్మ వేశా. రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.6 లక్షలు ఆదాయం తీశాను. సంక్షేమ పథకాల ద్వారా రూ.1.91 లక్షల మేర లబ్ధి పొందా. ఫలితంగా పిల్లలను మోడల్ స్కూల్లో చదివిస్తున్నా. బిందు సేద్యంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. సంక్షేమ ఫలాలు అందడంతో నిశి్చంతగా జీవిస్తున్నా. –మందా సుధాకర్ ఫలిస్తున్న సీఎం జగన్ కృషి ఉద్యాన హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.800 కోట్ల బకాయిలను చెల్లించడమే కాకుండా ఐదేళ్లలో రూ.2,670 కోట్ల సబ్సిడీ చెల్లించాం. 7.33 లక్షల ఎకరాలకు విస్తరించగలిగాం. –కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి 30 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయం..పోళ్లోపల్లికి చెందిన రైతు ఆనాల నరసింహులు 1989లో వ్యవసాయం భారమై బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ పడరాని పాట్లు పడి, సరైన సంపాదన లేక కుంగిపోయాడు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సూక్ష్మసేద్యంతో రైతులు లాభాలార్జిస్తున్నారని తెలిసి, నాలుగేళ్ల క్రితం గ్రామానికి తిరిగొచ్చి రెండెకరాల్లో నిమ్మ, 1.5 ఎకరాల్లో చీనీ వేశారు. నిమ్మ కాపు ప్రారంభమైన రెండేళ్లలోనే రూ.2.50 లక్షల ఆదాయం వచి్చంది.డ్రిప్ కోసం 2022లో ఆర్బీకేలో దరఖాస్తు చేసుకుంటే, సిఫార్సులతో పని లేకుండా 90 శాతం సబ్సిడీపై 3.5 ఎకరాల్లో రూ.62,934 విలువైన పరికరాలను అమర్చారు. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్, డ్రిప్ ఇరిగేషన్తో సాగు సాఫీగా సాగుతోంది. కువైట్కు తిరిగి వెళ్లాలన్న ఆలోచన విరమించుకుని 30 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయం చేపట్టిన నరసింహులు లాభాలు గడిస్తున్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ, ఆసరా, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన లాంటి పథకాల ద్వారా ఆయన కుటుంబం లబ్ధి పొందింది. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయగా, కొడుకును కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నట్లు ఎంతో ఆనందంగా చెప్పారాయన -
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబుతో తమకు అన్ని అంశాల్లోనూ సెటిల్మెంట్ కుదిరిందని, అన్నీ పరిష్కారమయ్యాయని పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్పారు. తమ అజెండాతో చంద్రబాబు ఏకీభవించినట్లు ఆయన స్పష్టంగా చెప్పారు. మరి ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ప్రతిపాదించిన బీజేపీతో ఏకీభవించి.. ఆ చట్టాన్ని ఇక్కడ వ్యతిరేకిస్తున్నారంటే ఏంటర్థం? ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తూ ఆ చట్టాన్ని రద్దు చేస్తాననటం ఎవరిని మోసం చేయడానికి? ఇది దుర్మార్గం కాదా?ప్రత్యేక హోదా ముగిసిందని చెబుతున్న బీజేపీతో జట్టు కట్టి.. లేదు లేదు ప్రత్యేక హోదా సాధిస్తామని చెబుతున్న చంద్రబాబు మోసగాడు కాడా? స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరించే విషయంలో తమ వైఖరి మారలేదని స్పష్టంగా చెబుతున్న బీజేపీతో కూటమి గట్టి పోటీ చేస్తూ.. ప్రయివేటీకరణను అడ్డుకుంటామని చెబుతున్న బాబు మాటలు అసలు ఒక్క శాతమైనా నమ్మేట్టున్నాయా? ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని, ఉమ్మడి శిక్షా స్మృతి తెస్తామని స్పష్టంగా చెబుతున్న బీజేపీతో కలిసి పోటీ చేస్తూ.. వాటిపై దాటవేత వైఖరి అనుసరిస్తుండటం బాబు దివాలాకోరు తనానికి పరాకాష్ట కాదా? అయినా చంద్రబాబును మోస్తున్న అను‘కుల’ మీడియాకు గానీ, పచ్చ ముఠాకు గానీ సిగ్గుందని అనుకోగలమా? బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి.. పార్టీ పెద్దల అపాయింట్మెంట్లు దొరక్కపోయినా పడిగాపులు కాసి... చచ్చీ చెడీ, శరణు శరణు అంటూ వేడుకుని మరీ పొత్తు పెట్టుకున్న వ్యవహారం యావత్తు ప్రజానీకం చూసిందే. కానీ పొత్తు కుదుర్చుకుని ఢిల్లీ నుంచి వచ్చాక చంద్రబాబు ఏమన్నాడో తెలుసా? ‘‘వాళ్లు అడిగితే మేం పొత్తు పెట్టుకున్నాం’’ అని. అదీ చంద్రబాబు ట్రేడ్ మార్కు. బీజేపీవిశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రయివేటీకరిస్తాం. ఇప్పటికీ మా వైఖరి అదేనని న్యాయస్థానాల సాక్షిగా బీజేపీ చెబుతోంది. ఈ మధ్యే రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ వేసి మరీ... విశాఖ స్టీల్పై తమ వైఖరి ఏమాత్రం మారలేదని స్పష్టంగా చెప్పింది. టీడీపీబీజేపీతో కలిసి పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు మాత్రం.. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ జరగనివ్వనని బయట బహిరంగ సభల్లో చెబుతున్నాడు. ఈయనకు తోడు మరో భాగస్వామిగా ఉన్న దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ సైతం ప్రయివేటీకరణ జరగనివ్వననిహూంకరిస్తున్నాడు. మరి ఆ మాట బీజేపీతో చెప్పించవచ్చు కదా? మీ మేనిఫెస్టోలో పెట్టవచ్చు కదా? ఎందుకీ దగుల్బాజీ మాటలు? ఇంకెన్నాళ్లు ఈ మోసపు బతుకులు? బీజేపీముస్లింలు ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నారని గ్రహించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. వారిని బీసీల్లో చేర్చి 4 శాతం రిజర్వేషన్లను కల్పించారు. నాటి నుంచీ అవి కొనసాగుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటోంది. తాము గనక అధికారంలోకి వస్తే.. ఈ రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ అగ్ర నేతలు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. టీడీపీబీజేపీతో కూటమి గట్టి పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు తాను ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పటం లేదు. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ... పక్క దోవ పట్టిస్తూ... ప్రచారాన్ని లాగించేస్తున్నాడు. బీజేపీతాము కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాగానే ముస్లింలకు వర్తించేలా ఉమ్మడి పౌర స్మృతి (సీసీసీ)ని తీసుకు వస్తామని బీజేపీ చెబుతోంది. టీడీపీదీనిపైనా చంద్రబాబు దాటవేతనే అనుసరిస్తున్నాడు.బీజేపీతో కలిసి పోటీ చేస్తూ.. వాళ్లతో అధికారం పంచుకుంటానని చెబుతున్న చంద్రబాబు వాళ్ల అజెండాతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పటం లేదెందుకు? ఎన్నాళ్లీ మోసం? రెండు నాల్కలతో ఎందరిని మభ్యపెడతారు? బీజేపీప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని, ఇక దాని గురించి ప్రస్తావించే అవకాశం గానీ, అవసరం గానీ లేదని బీజేపీ పదేపదే చెబుతోంది. ఈ మధ్యే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం... ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమన్నారు. ఈ హోదాకు తగ్గట్లుగా ప్రత్యేక ప్యాకేజీని గతంలోనే చంద్రబాబు నాయుడు తీసుకున్నారని, కనక దీనిపై ఆయన తమను అడిగే పరిస్థితి లేదని చెప్పారు. టీడీపీసిగ్గూ, మర్యాదా అన్నీ వదిలేసిన చంద్రబాబు నాయుడు.. ఇప్పటికీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. తాము గెలిస్తే రాష్ట్రానికి బీజేపీ సాయంతో ప్రత్యేక హోదాను సాధిస్తామని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెబుతుంటే... సాక్షాత్తు ప్యాకేజీ తీసుకున్న చంద్రబాబు మళ్లీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుండటం ఎవరి చెవుల్లో పువ్వులు పెట్టడానికి? పోనీ ప్రత్యేక హోదా అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టగలవా చంద్రబాబూ?
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement