గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారా...మీరు బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా...మీకు శ్రమించే తత్వం, పట్టుదల ఉందా...
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్లైన్: గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారా...మీరు బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా...మీకు శ్రమించే తత్వం, పట్టుదల ఉందా... అయితే మీకో సువర్ణావకాశం. దేశంలో నిరుద్యోగ యువతకు ఆశాదీపంలా ఈ ఏడాది బ్యాంకింగ్ రంగంలో వేలాది ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
ఈ ఉద్యోగాలకు లక్షలాదిమంది దరఖాస్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన సామాజిక బాధ్యతను గుర్తెరిగిన ‘సాక్షి’ తెలుగు దినపత్రిక-ఆదిత్య కాంపిటీషన్స్ సంస్థ సంయుక్తంగా నిరుద్యోగ యువతకు మార్గనిర్దేశనం చేసేందుకు శనివారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో దేశంలోనే అతిపెద్ధ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దేశ వ్యాప్తంగా భర్తీ చేయనున్న క్లరికల్ పోస్టులపై నిరుద్యోగ యువత, విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. సదస్సు శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనుంది.
ఈ సదస్సులో అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే అంశాలతో పాటు సందేహాలకు నిపుణులతో అవగాహన కల్పించడమే సదస్సు ముఖ్యోద్దేశం. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యం గల విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎటువంటి ప్రవేశ రుసుం చెల్లించనవసరం లేకుండానే ఈ అవగాహన సదస్సుకు హాజరుకావచ్చు.