ఆధార్తో అనుసంధానం చేసుకొనేందుకు గాయత్రి బ్యాంక్ ప్రత్యేక ఖాతాలు తెరుస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ ఎం.కృష్ణమూర్తి తెలి పారు. బ్యాంక్లో ఇప్పటిరకు 4,126 మంది ఖాతాదారుల ఆధార్నంబర్లను అకౌంట్తో అనుసంధానం చేశామన్నారు.
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్ : ఆధార్తో అనుసంధానం చేసుకొనేందుకు గాయత్రి బ్యాంక్ ప్రత్యేక ఖాతాలు తెరుస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ ఎం.కృష్ణమూర్తి తెలి పారు. బ్యాంక్లో ఇప్పటిరకు 4,126 మంది ఖాతాదారుల ఆధార్నంబర్లను అకౌంట్తో అనుసంధానం చేశామన్నారు. ఆధార్ అనుసంధానంతో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, రేషన్ సబ్సిడీలు పొందడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. నగదు బదిలీపథకానికి తమ బ్యాంక్ అకౌంట్ను వినియోగించుకోవాలని కోరారు.
ప్రతీ రోజు 100 నుంచి 200 వరకు నూతన ఖాతాలను ప్రారంభిస్తున్నామన్నారు. కరీంనగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో క్యాంప్లు నిర్వహించామని చెప్పారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 7గంటల వరకు,శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంక్ సేవలందిస్తున్నామన్నారు. విద్యార్థుల కోసం నామమాత్రపు బ్యాలెన్స్, ఏటీఎం సౌకర్యంతో కూడిన ఖాతాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గాయత్రి నిర్భయ సేవింగ్స్ ఖాతాద్వారా రూ.లక్ష ప్రమాదబీమా సౌకర్యం వర్తింపచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.