గూడ్స్ రైలులో మంటలు | fire accident at goods train in pundi railway station in srikakulam distirict | Sakshi
Sakshi News home page

గూడ్స్ రైలులో మంటలు

Feb 19 2015 4:48 PM | Updated on Sep 5 2018 9:45 PM

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు ఇంజిన్‌లో మంటలు రేగాయి.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు ఇంజిన్‌లో  గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. పలాస నుంచి విశాఖ వైపు బొగ్గుతో వెళ్తున్న రైలు స్టేషన్‌లో ఆగి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలింజన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు రేగటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంజిన్ కాలిపోవడంతో రూ.30 లక్షల మేర నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.
(వజ్రపుకొత్తూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement