పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి | Father and Son died due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి

Jun 4 2015 7:12 PM | Updated on Sep 2 2018 4:48 PM

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృత్యువాతపడ్డారు.

రేగిడి (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పెద్దసిర్లాం గ్రామానికి చెందిన కోడుబోయిన సంగం(55), అతని కుమారుడు బంగారి(38) మేకలు మేపేందుకు గురువారం మధ్యాహ్నం పొలాలకు వెళ్లారు. కాగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. అదే సమయంలో పొలంలో మేకలు మేపుతున్న సంగం, బంగారిపై పిడుగు పడటంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. కాగా పిడుగు శబ్దానికి మేకలు తలోదిక్కు పరుగు తీశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement