హెచ్పీసీఎల్ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య బుధవారానికి 12కి చేరింది.
విశాఖ: హెచ్పీసీఎల్ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య బుధవారానికి 12కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంట్రాక్ట్ కార్మికుడు అప్పారావు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. ఈరోజు అతను మృతి చెందటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. హెచ్పీసీఎల్ రిఫైనరీలో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరికొంతమంది పరిస్థితి విషమంగానే ఉంది.