హెచ్‌పీసీఎల్‌ ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య | Death toll in HPCL Visakhapatnam unit rises to 12 | Sakshi
Sakshi News home page

హెచ్‌పీసీఎల్‌ ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య

Aug 28 2013 9:08 AM | Updated on Sep 1 2017 10:12 PM

హెచ్‌పీసీఎల్ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య బుధవారానికి 12కి చేరింది.

విశాఖ: హెచ్‌పీసీఎల్ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య బుధవారానికి 12కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంట్రాక్ట్ కార్మికుడు అప్పారావు  మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. ఈరోజు అతను మృతి చెందటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.  హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరికొంతమంది పరిస్థితి విషమంగానే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement