ఏటా కారు ప్రమాదాలు దాదాపు పది లక్షల ప్రాణాలను హరించేస్తున్నాయి. బుధవారం రాత్రి వైఎస్ ఆర్ కాంగ్రెస్ కీలక నేత శోభా నాగిరెడ్డి కూడా కారు ప్రమాదంలో మరణించారు. కారు ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పెట్టలేమా? విలువైన ప్రాణాలను కాపాడలేమా?
కారు ప్రమాదాలను నివారించే దిశగా ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఆ పరిశోధనల నుంచే 1948 లో రోడ్ గ్రిప్, త్వరగా బ్రేక్ పడే అవకాశాలున్న రేడియల్ టైర్లు వచ్చాయి. 1958 లో వోల్వో కంపెనీ సీట్ బెల్టుల్ని కనుగొంది. 1950 లో ఎయిర్ బ్యాగ్స్ వాడకం మొదలైంది. కారు ప్రమాదం జరగగానే ఒక బెలూన్ విచ్చుకుని దెబ్బ తగలకుండా షాక్ అబ్సార్బ్ చేస్తుంది. అయితే శోభా నాగి రెడ్డి విషయంలో ఎయిర్ బాగ్స్ విచ్చుకోలేదు. ఇటీవలే పలు ఆటో మొబైల్ కంపెనీలు ఎయిర్ బ్యాగ్స్ సరిగా పనిచేయకపోవడంతో లక్షలాది కార్లను వెనక్కి రప్పించాయి.
కారు ప్రమాదాలను పూర్తిగా నివారించే దిశగా మూడు రంగాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి.
ఆటో బ్రేకింగ్ - ముందున్న వాహనాలకు కారు మరీ దగ్గరగా వస్తే తనంతట తానుగా బ్రేక్ పడిపోయే టెక్నాలజీని ప్రస్తుతం రూపొందిస్తున్నారు. కారు లో ఉండే సెన్సర్లు కారును తక్షణం ఆపేస్తాయి. స్వీడెన్ లో ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇంటెలిజెంట్ విండ్ స్క్రీన్ - డ్రైవర్ కారు నడిపేటప్పుడు ఎటు వైపు చూస్తున్నారన్న విషయాన్ని విండ్ స్క్రీన్ కనిపెట్టి డ్రైవర్ కి సలహా ఇచ్చేలా శాస్త్రవేత్తలు వ్యవస్థలను రూపొందిస్తున్నారు. రోడ్డు అంచు ఎక్కడ ఉంది, డ్రైవర్ దృష్టి ఎక్కడుంది వంటి విషయాల్లో డ్రైవర్ కి విండ్ స్క్రీన్ సూచనలను ఇస్తుంది.
క్రాష్ టెస్ట్ డమ్మీ - కారు నడిపించే వారి ఎత్తు, బరువు, వయస్సు వంటి అంశాల ఆధారంగా, ఎంత వేగంతో ఢీకొన్నారు లేదా పల్టీ కొట్టారన్న అంశాల ఆధారంగా శాస్త్రవేత్తలు వందకు పైగా నమూనాలను తయారు చేశారు. ఎంత బరువున్న వ్యక్తి ఎంత వేగంతో ఢీకొంటే ఏయే అవయవానికి ఎంత ప్రమాదకారి వంటి అంశాలను పరిశీలించి దాని ఆధారంగా భద్రతా ఏర్పాట్లు చేయడానికి వీలుంటుంది. ఈ పరిశోధనలు ప్రమాదాలను వీలైనంత వరకూ తగ్గించగలవు.
ఎన్ని భద్రతా ఏర్పాట్లున్నా మానవ తప్పిదమే అన్నిటికన్నా ప్రమాదకరమైన సమస్య. మితిమీరిన వేగం, రోడ్డు పై దృష్టి లేకపోవడం, నిద్ర లేమితో డ్రైవ్ చేయడం, మద్యం వంటి పదార్థాలు సేవించడం వంటివి తగ్గించుకుంటే ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు.
కారు ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పెట్టలేమా?
Published Thu, Apr 24 2014 4:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement