నాడు పల్లెలు కళకళ | But they believe on | Sakshi
Sakshi News home page

నాడు పల్లెలు కళకళ

Apr 13 2014 3:26 AM | Updated on Aug 11 2018 8:58 PM

నాడు పల్లెలు కళకళ - Sakshi

నాడు పల్లెలు కళకళ

కరువుకు నిలయమైన జిల్లాలో వ్యవసాయం జూదంగా మారింది. ఈ ఏడాది కాకపోయినా మరో ఏడాదైనా పంటలు పండకపోతాయా? అప్పులు తీరకపోతాయా? అని రైతుల్లో ఆశ. మట్టిని నమ్ముకున్న సగటు రైతు ప్రతిసారి మోసపోతున్నాడు.

వైఎస్ హయాంలో గ్రామం యూనిట్‌గా పారదర్శకంగా పంటల బీమా పథకం
టీడీపీ అధినేత చంద్రబాబు జమానాలో మండలం యూనిట్‌గా పథకం అమలు
ఇపుడు రెండింటీనీ పక్కనపెట్టి వాతావరణ బీమా పథకంతో దగా చేస్తున్న నేతలు

 
 అనంతపురం అగ్రికల్చర్,  కరువుకు నిలయమైన జిల్లాలో వ్యవసాయం జూదంగా మారింది. ఈ ఏడాది కాకపోయినా మరో ఏడాదైనా పంటలు పండకపోతాయా? అప్పులు తీరకపోతాయా? అని రైతుల్లో ఆశ. మట్టిని నమ్ముకున్న సగటు రైతు ప్రతిసారి మోసపోతున్నాడు.  వర్షాభావం, తెగుళ్ల కారణంగా పంటలు చేతికందక  కొందరు రైతులు బలవన్మరణాలకు గురయ్యారు. మరికొందరు పువ్వులమ్మిన చోట కట్టెలు అమ్మలేక రైతు కూలీలుగా మారి వలస పోయారు. పచ్చగా ఉండాల్సిన గ్రామీణంలో ఏ పల్లెలో చూసినా శ్మశాన వైరాగ్యం. ఆదుకోవాల్సిన పాలకులు బాధ్యత విస్మరించి ‘వ్యవసాయం దండగా’ అన్నారు. 2004 వరకు ఉన్న ఈ పరిస్థితి తర్వాత మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు వైఎస్ రాజశేఖరరెడ్డి రూపంలో ఓ భరోసా లభించింది. ఈ విషయం ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే  రైతు పక్షపాతి ఎవరన్నది ఇట్టే అర్థం అవుతుంది.
 
చంద్రబాబు నాయుడు హయాంలో జిల్లాలో మూడేళ్లు పంటలు దెబ్బతినగా 4.05 లక్షల మంది రైతులకు అందిన పరిహారం కేవలం రూ.224.84 కోట్లు. అంటే హెక్టార్‌కు రూ.1500 చొప్పున మాత్రమే పరిహారం ఇచ్చారు. వైఎస్ ముఖ్య మంత్రి అయిన తర్వాత జిల్లాలోగ
 నాలుగేళ్లు పంటలు దెబ్బతినగా 10.49 లక్షల మంది రైతులకు రూ.1,116.50 కోట్ల బీమా పరిహారాన్ని అందజేశారు.

చంద్రబాబునాయుడు మండలాన్ని యూనిట్‌గా బీమా పథకం అమలు చేయగా, వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని పరిహారం అందచేయడంతో నష్టపోయిన రైతులకు పూర్తి న్యాయం జరిగింది.  హెక్టారుకు రూ.1,500 చొప్పున పరిహారాన్ని ఒకేసారి రూ.4,500 పెంచడంతో రైతులకు ఉపశమనం లభించింది. అయితే విధి మరోసారి రైతులను మోసం చేసింది.   వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతితో తిరిగి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. 

రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో పంటల బీమా పథకాన్ని కొనసాగించినా ఆశించిన స్థాయిలో బీమా పరిహారం ఇవ్వలేకపోయారు. 2009లో 3.93 లక్షల మంది రైతులకు రూ.228.96 కోట్లు పంపిణీ చేశారు. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. అప్పటిదాకా ఉన్న బీమా పథకంలో లోపాలున్నాయన్న సాకుతో వర్షాధార వాతావరణ బీమా పథకాన్ని అమలులోకి తెచ్చారు.  2011లో వేరుశనగ పంట దారుణంగా దెబ్బతిన్నా వాతావరణ బీమా పరిహారం నామమాత్రంగానే అందింది. కొన్ని మండలాల్లో నయాపైసా కూడా చూపలేదు. ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కొందరికి కొంత పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement