సీమాంధ్రులకు చెందిన హైదరాబాద్లోని ఆస్తులకు రక్షణ కల్పించాలని బిజెపి సీమాంధ్ర నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాధ్సింగ్ను కోరారు.
ఢిల్లీ: సీమాంధ్రులకు చెందిన హైదరాబాద్లోని ఆస్తులకు రక్షణ కల్పించాలని బిజెపి సీమాంధ్ర నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాధ్సింగ్ను కోరారు. వారు ఈరోజు ఇక్కడ రాజ్నాధ్సింగ్ను కలిశారు. రాష్ట్రవిభజన జరిగితే పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజనకు బిజెపి మద్దతు పలుకులుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ తాము మద్దతు తెలుపుతామని బిజెపి ప్రకటించింది.